Mobile Blast: స్మార్ట్ ఫోన్ పేలి బాలిక మృతి.. స్పందించిన షావోమీ..
కార్టూన్లు చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో 8 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో జరిగింది. ఫోన్ను ఎక్కువసేపు వాడడం వల్లే బ్యాటరీ ఎక్కువగా వేడెక్కడం వల్ల పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బాలిక చేతిలోని మొబైల్ ఫోన్ పేలడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదని ఫోన్ ఫోరెన్సిక్ పరీక్ష తర్వాత ఏ జరిగిందో తెలుస్తుందని చెప్పారు
"పేలుడు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆమె కుడి అరచేతి, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగువారు కూడా ధ్వని చాలా ఎక్కువగా ఉందని చెప్పారు"అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మొబైల్ ఫోన్ బ్యాటరీలు చిన్నపాటి పేలుడు సంభవించినట్లు గతంలో కూడా నివేదించామని, అయితే ఇది అరుదైన సంఘటన అని ఆయన అన్నారు. మృతి చెందిన బాలిక మాజీ బ్లాక్ పంచాయతీ సభ్యుని కుమార్తెగా గుర్తించారు.

ఘటన జరిగినప్పుడు బాలికతో పాటు అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నారు. బాలిక తరచుగా కార్టూన్లు చూసేదని, పాఠశాల సెలవులు మరింత ఎక్కువ ఫోన్లు చూస్తున్నట్లు చెప్పారు. ఈ మొబైల్ ఫోన్ను మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారని, మూడు నెలల క్రితం బ్యాటరీని మార్చారని బాలిక తండ్రి చెప్పారు. ఈ ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందించారు. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని చెప్పారు.
ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
-
T20 World cup: విండీస్ పై ఆడే టీమిండియా ఇదే..! రింకూ సస్పెన్స్ కు తెర..! -
అమెరికాలో సంవత్సరం ఆడి సంచలనం సృష్టించిన తెలుగు సినిమా -
Free Bus ఏపీలో ప్రారంభమైన కొత్త పథకం, వారికి కూడా ఇంద్రధనస్సు -
అంచనాలకు అందని బంగారం ధరలు- తలకిందులు -
ట్రంప్ ఆజ్ఞను ధిక్కరించిన సైన్యం.. AI తో ఇరాన్పై దాడి -
టీటీడీ వాడి అబ్బ సొత్తా- చంద్రబాబు చెబితే నిమిషంలో రాజీనామా చేస్తా- బీఆర్ నాయుడు -
IND vs WI: స్కోర్ చెప్పేసిన దాదా.. చెమటలు చిందిస్తున్న టీమిండియా -
ఖమేనీ కేవలం నేత కాదు.. కోట్ల మంది మతగురువు: ప్రధాని మోదీకి ఒవైసీ డిమాండ్ -
CBSE Board Exams Deferred: రేపు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు వాయిదా..! -
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. వీళ్లు అస్సలు మిస్ అవ్వొద్దు..! -
Silver:వెండి ధరలకు విస్ఫోటనం సంకేతాలు! సోమవారం ఏం జరగబోతుంది -
చుక్కలు చూపెడుతున్న సిలిండర్ రేట్లు- ఏటీఎఫ్ ధరలకూ రెక్కలు












Click it and Unblock the Notifications