వణికించిన అర్ద్రరాత్రి భూకంపం..!!
అర్ద్రరాత్రి భూకంపం వణికించింది. అస్సాంలోని మారిగావ్ లో అర్ద్రరాత్రి 2.25 గంటల ప్రాంతం లో ఒక్క సారి భూకంపం చోటు చేసుకుంది. దీంతో, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రోడ్ల పైకి చేరుకున్న వారంతా అక్కడే గడుపుతున్నారు. రిక్టర్ స్కేల్ పైన 5.0 గా తీవత్ర నమోదైంది. భూకం ప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. గౌహతిలోనూ భూ ప్రంకపనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో అధికారులు అలర్ట్ అయ్యారు.
అస్సాంలో అర్ద్రరాత్రి చోటు చేసుకున్న భూకంపంతో మోరిగావ్ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 2.25 గంటలకు ఈ భూకంపం చోటు చేసుకుంది. నిద్ర సమయంలో చోటు చేసుకున్న ప్రకంపన లతో ఒక్క సారిగా కలత చెందారు. ప్రకంపనలతో వారంతా రోడ్ల పైకి చేరుకున్నారు. రాత్రి నుంచి ఆరుబయటే గడుపుతున్నారు. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం పైన అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల క్రితమే అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్గురి జిల్లాలో భూకంపం చోటు చేసుకుంది. తాజా భూకంపం పైన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధ్యయనం చేస్తోంది.

మోరిగావ్ జిల్లాల్లో ప్రజలంతా నిద్రలో ఉన్న సమయంలో ఈ భూకంపం సంభవించింది. గతంలో నూ ఇదే ప్రాంతంతో పాటుగా గౌహతి సమీప ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూ అంతర్భా గంలో 10 కిమీ లోతులో భూమి కంపించందని ఎన్సీఎస్ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా ఉత్తర భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో వరుసగా భూకంపాలు వస్తున్నాయి.
ఢిల్లీలోనూ భూ పక్రంపనలు చోటు చేసుకున్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సూచిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతోపాటు.. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications