Controversy: ఆంజనేయస్వామి గుడి షాషింగ్ కాంప్లెక్స్, ముస్లీంల షాప్ రూమ్ లకు తాళం, బ్యాన్ చెయ్యాలి !
బెంగళూరు: హిజాబ్ వివాదం ఎత్తపెద్ద రాద్దాంతం అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో హిజాబ్ వివాదం కొంత సర్దుమనిగింది అనుకున్న సమయంలో కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే సమయంలో హిజాబ్ వివాదానికి కేంద్ర బింధువు అయిన కర్ణాటకలో మరో వివాదానికి తెరలేపింది. ముస్లీం వ్యాపారులను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక కేంద్రాలు, దేవాదాయ శాఖకు చెందిన షాప్ రూమ్ ల్లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంలను వెంటనే ఖాళీ చేయించాలని పలు హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
హిందువులు పూజలు చెయ్యడానికి కావలసిన వస్తులు విక్రయిస్తూ వారి నుంచి లాభం పొందుతూ చివరికి వారినే టార్గెట్ చేసుకుంటున్న ముస్లీంలను వెంటనే దేవాదాయ శాఖకు చెందిన షాపింగ్ క్లాంప్లెక్స్ లో నుంచి ఖాళీ చేయించి ఆ షాపు రూమ్ లు హిందువులకే కేటాయించాలని హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని కరావళి ప్రాంతాల్లో హిందువులు నిర్వహించే జాతరల్లో ముస్లీం వ్యాపారులను బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా బెంగళూరులో హిందూ దేవాలయాలకు చెందిన షాపు రూమ్ లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంలకు చెందిన షాపు రూమ్ లకు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లీంల మద్య చిచ్చుపెడుతోందని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కర్ణాటకలో ఇప్పుడు ఈ వివాదం ఎంత వరకు దారితీస్తుందో వేచి చూడాలి.
కలకలం రేపిన హిజాబ్ వివాదం
హిజాబ్ వివాదం ఎత్తపెద్ద రాద్దాంతం అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో హిజాబ్ వివాదం కొంత సర్దుమనిగింది అనుకున్న సమయంలో కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
హిందూ దేవాలయాల షాపుల్లో వ్యాపారం చేస్తున్న ముస్లీంలు
హిజాబ్ వివాదం ఎత్తపెద్ద రాద్దాంతం అయ్యిందో పెద్దగా చెప్పనవసరం లేదు. కర్ణాటక హైకోర్టు తీర్పుతో హిజాబ్ వివాదం కొంత సర్దుమనిగింది అనుకున్న సమయంలో కొందరు ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కర్ణాటకలోని అనేక జిల్లాల్లో దేవాదాయ శాఖకు చెందిన షాప్ రూమ్ ల్లో, హిందూ దేవాలయాలకు చెందిన షాపు రూమ్ లో ముస్లీంలు వ్యాపారాలు చేస్తున్నారు.
జాతరలో ముస్లీం వ్యాపారుల బహిష్కరణ
ఇప్పటికే కర్ణాటకలోని కరావళి ప్రాంతాల్లో హిందువులు నిర్వహించే జాతరల్లో ముస్లీం వ్యాపారులను బహిష్కరించారు. ఇటీవల కర్ణాటకలోని కోల్లూరు దేవాలయం సమీపంలో జరిగిన జాతరలో ముస్లీం వ్యాపారులు వ్యాపారం చెయ్యడానికి అవకాశం ఇవ్వకూడదని అక్కడి పంచాయితీ అధికారులకు స్థానిక హిందూ సంఘ, సంస్థ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు. చిక్కమగళూరులోని కిగ్గ ఖుష్యంగ జాతరలో ముస్లీం వ్యాపారుల పాల్గొనకుండా చూడాలని అక్కడి అధికారులకు స్థానిక హిందూ సంఘ, సంస్థ ప్రతినిధులు మనవి చేశారు.
బెంగళూరులో ఆంజనేయస్వామి ఆలయంలో ?
బెంగళూరు నగరంలోని ఉప్పరపేట్ లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం షాపింగ్ రూమ్స్ లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంలకు చెందిన షాపు రూమ్ లో మూసివేయడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని బనశంకరికి చెందిన దేవాదాయ శాఖ పరిదిలోని షాపుల్లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంల షాపులు క్లోజ్ చేపించి ఆ రూమ్ లు హిందువులకు కేటాయించాలని పలు హిందు సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న తహసిల్దార్ చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని హిందూ సంఘ, సంస్థలకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
బెంగళూరులో డిమాండ్
హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక కేంద్రాలు, దేవాదాయ శాఖకు చెందిన షాప్ రూమ్ ల్లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంలను వెంటనే ఖాళీ చేయించాలని పలు హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా బెంగళూరులో హిందూ దేవాలయాలకు చెందిన షాపు రూమ్ లో వ్యాపారాలు చేస్తున్న ముస్లీంలకు చెందిన షాపు రూమ్ లకు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇదేనా రాజకీయం ?
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లీంల మద్య చిచ్చుపెడుతోందని ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో, కర్ణాటకలో ముస్లీంలను టార్గెట్ చేసుకుంటున్న బీజేపీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. కర్ణాటకలో ఇప్పుడు ఈ వివాదం ఎంత వరకు దారితీస్తుందో వేచి చూడాలి.