షీనా హత్యలో షాకింగ్: ప్రీగా ఇంద్రాణికి అతను సాయం
ముంబై: షీనా బోరా హత్య కేసులో మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి కోసం... ఆమె డ్రైవర్ ఉచితంగా హత్యలో సహకరించాడట.
ఇంద్రాణి ముఖర్జీయాకు డ్రైవర్ శ్యాం రాయ్ ఉచితంగా సహకరించాడని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్... ఇంద్రాణి నుంచి లేదా ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా నుంచి ఎలాంటి డబ్బు లేదా ఇతరాలు తీసుకోలేదు. అయితే, అతను ఆమె వద్ద ఉద్యోగం మానేసే సమయంలో.. ఇంద్రాణి అతనికి రూ.1లక్ష ఇచ్చింది.అయితే, ఆ రూ.1లక్ష కూడా అతనికి హత్య చేసినందుకు ఇచ్చింది కాదు. అది అదని మూడు నెలల జీతం.
షీనాను హత్య చేశాక.. ఇంద్రాణి తన కార్లను అన్నింటిని అమ్మేసినట్లు డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. డ్రైవర్ రాయ్ కూడా తప్పనిపరిస్థితుల్లో అక్కడ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఉద్యోగం మానేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో డ్రైవర్కు ఆమె రూ.లక్ష ఇచ్చింది. అది అతని మూడు నెలల వేతనం.

షీనా పంపిన మెయిల్స్.. కాదు!
షీనా అమెరికాలో ఉన్నట్లు అందర్నీ ఇంద్రాణి నమ్మించిన విషయం తెలిసిందే. ఇందుకోసం పీటర్, మిఖాయిల్లకు షీనా అమెరికా నుంచి మెయిల్స్ పంపించింది. అయితే, వాటిని ఇంద్రాణి పంపించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి అమెరికా వెళ్లినప్పుడు అక్కడి నుంచి షీనా పంపినట్లుగా మెయిల్స్ పంపించింది.
షీనా పేరిట ఫేక్ ఈ మెయిల్ ఓపెన్ చేయాలని తన కంపెనీలో చేసే వారికి ఇంద్రాణి ఆదేశించింది. పాస్ వర్డ్, ఈ మెయిల్ తీసుకొని.. షీనా పంపించినట్లుగా ఇంద్రాణి వారికి మెయిల్స్ పంపించింది.
కస్టడీ పొడిగింపు
షీనా హత్యకేసులో ప్రధాన నిందితులు ఇంద్రాణి ముఖర్జీ, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ల పోలీస్ కస్టడీని ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగిస్తూ ముంబైలోని బాంద్రా కోర్టు మేజిస్ట్రేట్ ఎస్ ఎం చాంద్గడే ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు విధించిన పక్షం రోజుల కస్టడీ గడువు ముగిసిపోవడంతో ముంబై పోలీసులు వారిని శనివారం న్యాయస్థానం ముందు హాజరు పర్చారు.
కేసు దర్యాప్తులో ఇంద్రాణి పోలీసులకు సహకరించడం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైభవ్ బగాడే వాదించారు. కేసు దర్యాప్తు పరిధి పెద్దదని, నిందితులు నోరు మెదపటం లేదని, హత్యకు ఈ - మెయిల్, ఇంటర్నెట్తో ప్రణాళిక వేశారన్నారు. కేసు దర్యాప్తు విస్తృతి దృష్ట్యా కస్టడీ సమయం చాలా తక్కువగా ఉందని తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications