కాలుష్య గాలి పీలుస్తున్నారా ..? ఇక మీ పని అంతే .. చైనా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ?
హర్యానా : మీరు ఎక్కువగా బయట తిరుగుతుంటారా ? దుమ్ము, ధూళితోపాటు కాలుష్యం నిండిన గాలి పీలుస్తుంటారా ? ఇకనైనా జాగ్రత్తపడండి. లేదంటే షుగర్ వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
పీల్చి పిప్పిచేస్తోన్న షుగర్
షుగర్, డయాబెటిస్ ఇలా ఏ పేరుతో పిలిచినా .. ఈ జబ్బు మనిషిని పీల్చి పిప్పి చేస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా డయాబెటిస్ కేసులు నమోదవుతోంది చైనాలోనే. దీనికి కారణం ఏంటో తెలుసుకోవడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి .. కాలుష్య గాలి పీల్చుకోవడంతోనే షుగర్ వ్యాధి వస్తోందని నిర్ధారించారు.

11 ఏళ్లు .. 88 వేల మంది
షుగర్ వ్యాధి వ్యాప్తికి గల కారణాలు తెలుసుకోవాలనుకున్న నిపుణుల బృందానికి ఆసక్తికర అంశాలు తెలిశాయి. గాలి కాలుష్యం పీఎం 2.5 దాడినిప్పుడు మాత్రమే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని గుర్తించారు. దాదాపు పదకోండేళ్లు ..2004 నుంచి 2015 వరకు గాలిలో కాలుష్యం పీఎం 2.5 ఉన్నప్పటి పరిస్థితులను శాటిలైట్ ద్వారా సేకరించి సమగ్రంగా అధ్యయనం చేశారు.
యువతపై అధిక ప్రభావం
గాలిలో కాలుష్యం 2.5 పీఎం దాటినప్పుడు వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా యువత, మధ్య వయసువారిపై .. పొగతాగని పురుషులు, స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపినట్టు పరిశీలనలో తేలింది. దీనికి పరిష్కారం గాలిలో కాలుష్యం తగ్గితే చైనాలో డయాబెటిస్ కేసులు తగ్గుతాయని రీసెర్చర్లు పేర్కొన్నారు.

అంతా చీకటి ...
గాలి కాలుష్యం పీఎం 2.5 శాతం దాటితే వాతావరణం పొగచూరినట్టు మారుతోంది. ఎదురుగా వస్తున్న వ్యక్తులు ఎవరూ కనిపించరు. ఇక వాహనాల సంగతి అయితే చెప్పక్కర్లేదు.












Click it and Unblock the Notifications