Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడు రాష్ట్రాల్లో పోలింగ్: అందరి కళ్లు కేరళం వైపే..!!

Live

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2026 ఏప్రిల్ 9వ తేదీన మూడు రాష్ట్రాలకు పోలింగ్ జరగనుంది. అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. గత కొన్ని రోజులుగా అక్కడి అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఫైనల్‌గా ఆ రాష్ట్ర ప్రజల చేతిలో ఓటు అస్త్రం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది.

assembly-elections-2026-live-updates-in-telugu-voters-cast-ballots-in-assam-kerala-puducherry-today

అస్సాం అసెంబ్లీకి మొత్తం 126 స్థానాలుండగా అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.ఇక అక్కడ ప్రధాన పోటీ ఎన్డీయే కాంగ్రెస్ కూటమిల మధ్యే ఉండనుంది. ఇక కేరళంలో ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్‌గా పోటీ జరుగుతుంది. పినరయి విజయన్ గెలిచి వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు వ్యూహాలు రచించగా..ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రయత్నిస్తోంది. కేరళం రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 140 స్థానాలున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు కొన్ని చోట్ల ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Apr 09, 2026, 7:28 am IST
కేరళ

తిరువనంతపురం

Mohan Lal
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముదవాన్ ముగళ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆ సమయంలో ఆయన వెంట మంత్రి, ఎల్డీఎఫ్ అభ్యర్థి వీ శివన్ కుట్టి ఉన్నారు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్నారు వారిద్దరూ.
Apr 09, 2026, 7:09 am IST
ఢిల్లీ

ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. కేరళ- 140, అస్సాం- 126, పుదుచ్చేరి- 30 స్థానాలకు ఒకేదశలో నేడు పోలింగ్ జరుగుతోంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు.
Apr 09, 2026, 7:06 am IST
కేరళ

పరవూర్

VD Satheesan
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేసరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రతిపక్ష నేత వీడి సతీషన్. తన వంతు వచ్చేంత వరకు ఓటర్లతో పాటు క్యూ లో నిల్చొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పరవూర్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు.
Apr 09, 2026, 6:53 am IST
కేరళ

గురువాయూర్

Suresh Gopi
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి గురువాయూర్ దేవస్వొం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న త్రిశూర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సురేష్ గోపీ.
Apr 09, 2026, 6:25 am IST
ఢిల్లీ

వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కూడా నేడే జరగబోతోంది. కర్ణాటకలో దావణగెరె సౌత్, బాగల్ కోటె, అజిత్ పవర్ కన్నుమూతతో ఖాళీ అయిన మహారాష్ట్రలోని బారామతి స్థానానికి నేడు పోలింగ్.
Apr 09, 2026, 6:07 am IST
ఢిల్లీ

కేరళం, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈవీఎంల పనితీరును పరిశీలించడానికి ఉద్దేశించిన మాక్ పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ మూడుచోట్లా ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+