ఏటీఎమ్తో పాటు సీసీటీవీ కెమెరాలను ఎత్తుకెళ్లారు...!
న్యూఢిల్లీ: ఏటీఎమ్ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎమ్ మిషన్ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎమ్ను శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా పుటేజ్లను చూద్దామనుకుంటే.. దొంగలు తెలివిగా సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారు. ఏటీఎమ్ మిషన్ ఉన్న ప్రాంతంలో ముందుగా వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకుపోయారని పోలీసులు తెలిపారు. ఏటీఎమ్ కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు చెప్పారు.













Click it and Unblock the Notifications