రూ. 7 లక్షలు: ఏటీఎం మిషన్ ఎత్తుకుపోయారు
రుద్రపూర్: నగదు చోరీ చెయ్యడానికి వెళ్లిన దుండగులు వీలుకాకపోవడంతో ఏటీఎం యంత్రం ఎత్తుకుని మాయం అయిన సంఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని ఉదయ్ సింగ్ నగర్ జిల్లా పంత్ నగర్ లో జరిగిన ఈ సంఘటనతో ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు హడలిపోయారు.
పంత్ నగర్ లోని అశోక్ లేలాండ్ కంపెనీ మెయిన్ గేట్ దగ్గర ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎం కేంద్రం ఉంది. బుధవారం మధ్యాహ్నం బ్యాంకు సిబ్బంది ఏటీఎం మిషన్ లో నగదు పెట్టారు. రాత్రి వరకు అక్కడ పోలీసులు గస్తి తిరిగారు. ఏటీఎం కేంద్రం దగ్గర సెక్యూరిటి గార్డు లేడు.
గురువారం వేకువ జామున దుండగులు నగదు లూటీ చెయ్యడానికి ఏటీఎం కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను ద్వంసం చేశారు. తరువాత ఏటీఎం మిషన్ లో నగదు లూటీ చెయ్యడానికి విఫలయత్నం చేశారు.

వీలు కాకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్ ఎత్తుకుని వారు వచ్చిన వాహనంలో వేసుకుని పరారైనారు. విషయం తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ నీలేష్ ఆనంద్ బర్నె సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏటీఎం యంత్రంలో రూ. 7 లక్షలు ఉందని బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ నీలేష్ ఆనంద్ బర్నె తెలిపారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications