Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెడ్ రూమ్ లో చూశాడని కొడును చంపేసిన ఆంటీ, బాయ్ ఫ్రెండ్ తో !

లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేసింది. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్తతో హ్యాపీగా కాపురం చేస్తున్న భార్యకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న ఆంటీ ఆమె అక్రమ సంబంధం గురించి బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రియుడితో కలిసి రొమాన్స్ చేస్తున్న సమయంలో ఆంటీ రెడ్ హ్యాండెడ్ గా ఆమె కొడుక్కి చిక్కిపోవడంతో అక్కడ అసలు కథ మొదలైయ్యింది.

ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని పడల్‌పూర్‌ లో కల్యాణ్ సింగ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జూలై 5న తన 8 ఏళ్ల కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజం బయటపడింది. 8 ఏళ్ల బాలుడు జూలై 2న చివరిసారిగా ఇంటి వద్ద ఉన్నాడని తండ్రి కళ్యాణ్ సింగ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో చెప్పాడు.

Aunty

కల్యాణ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు జరిపిన సోదాల్లో బాలుడి మృతదేహం సమీపంలోని సంబల్ జిల్లాలోని ఓ నది నీటి ప్రవాహంలో లభ్యమైంది. తండ్రి కళ్యాణ్ సింగ్ స్వస్థలం సంబల్ కావడంతో బాలుడి మృతిలో అతని బంధువుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. అప్పుడే బాలుడి హత్య వెనుక అతని తల్లి ఉందనే దిమ్మతిరిగే నిజం బయటపడింది.

కల్యాణ్ సింగ్ భార్య పేరు పూరి సవిత. తమ ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్న పూరికి, ఓంపాల్ సింగ్ అనే యువకుడితో పరిచయం పెరిగిపోవడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రియుడు ఓంపాల్ సింగ్ తో పూరి సవిత పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది. అప్పటికే కల్యాణ్ సింగ్, పూరి సవిత దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

Aunty

ఓంపాల్ సింగ్, పూరి సవితల అక్రమ సంబందం చాలా కాలంగా నడుస్తోంది. ఈ విషయం కళ్యాణ్ సింగ్ కి పూర్తిగా తెలియదు. ఈ సందర్భంలో కల్యాణ్ సింగ్ 8 ఏళ్ల కొడుకు తన తల్లి పూరి సవిత అక్రమ సంబంధం వ్యవహారం గురించి తెలుసుకున్నాడు. కొడుకు తల్లి పూరి సవితను, ఓంపాల్ సింగ్‌ నగ్నంగా బెడ్ రూమ్ లో కలిసి రాసలీలలు ఆడుతున్న వియం చూసి షాక్ అయ్యాడు.

జూన్ 28వ తేదీన తల్లి పూరి సవిత, ఓంపాల్ సింగ్ బెడ్ రూమ్ లో ఉన్న విషయాన్ని అతని కొడుకు చూశాడు. కళ్యాణ్ సింగ్‌కి అసలు విషయం తెలుస్తుందన్న భయంతో ఇద్దరూ బాలుడిని చంపాలని ఆమె తల్లి పూరి సవిత, ఆమె ప్రియుడు ఓంపాల్ సింగ్ నిర్ణయించుకున్నారు. బాలుడు అసలు మ్యాటర్ బయటకు చెబితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారు.

దాని ఆధారంగా తల్లి పూరీ సవిత 8 ఏళ్ల బాలుడిని సంబల్‌లోని బంధువుల ఇంటికి పంపింది. ఈ విషయం భర్త కళ్యాణ్ సింగ్‌కు తెలియదు. ఆ తర్వాత జులై 6న బాలుడికి విషమిచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. తరువాత బాలుడిని సమీపంలోని నది ప్రవాహంలోని నీటిలో పడేయడంతో అతను మునిగిపోయాడు.

ఈ హత్య కేసులో తల్లి పూరీ సవిత, ఆమె ప్రేమికుడు ఓంపాల్‌ సింగ్ ను అరెస్టు చేశారు. అలాగే బాలుడి హత్య కుట్రకు మద్దతు ఇచ్చిన పూరి సవిత బంధువులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిపై హత్య కేసుతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం గురించి తెలిసిపోయిందని కన్న కొడుకును ఆమె తల్లి హత్య చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+