బాబ్రీ కేసులో మరో మలుపు: మహంత్ భాస్కర్ కన్నుమూత..
బాబ్రీ మసీద్ వివాదంలో హిందువుల పక్షాన పోరాడుతున్న మహంత్ భాస్కర్ దాస్(89) గుండెపోటుతో కన్నుమూశారు. ఇదే కేసులో ముస్లింల పక్షాన పోరాడుతున్న హషీమ్ అన్సారీ(95) కూడా గతేడాది కన్నుమూశారు.
న్యూఢిల్లీ: బాబ్రీ మసీద్ వివాదంలో హిందువుల పక్షాన పోరాడుతున్న మహంత్ భాస్కర్ దాస్(89) గుండెపోటుతో కన్నుమూశారు. ఇదే కేసులో ముస్లింల పక్షాన పోరాడుతున్న హషీమ్ అన్సారీ(95) కూడా గతేడాది చనిపోవడంతో.. కేసుకు సంబంధించి తొలి కక్షిదారులు ఇద్దరు చనిపోయినట్లు అయింది.
మహంత్ భాస్కర్ దాస్, హషీమ్ అన్సారీ మరణాల నేపథ్యంలో.. వీరిద్దరికీ అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కేసును ముందుకు నడిపిస్తారని తెలుస్తోంది. కాగా, శుక్రవారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో మహంత్ భాస్కర్ దాస్ ను ఘజియాబాద్ లోని హర్ష హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చేర్చారు.

ఛాతిలో నొప్పితో పాటు ఉదయం ఆయనకు శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలయ్యాయి. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం అందుకు సహకరించలేదు.
ఇదిలా ఉంటే, వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతంపై మహంత్ భాస్కర్ దాస్ తొలిసారి 1959లో కోర్టు మెట్లు ఎక్కారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న నిర్మోహి అఖాడా.. సరయూ నది తీరంలో అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications