Baby: పురిటిబిడ్డ బరువు ఎంతో చూడాలని చెప్పి నకిలీ నర్సు ఎస్కేప్ , సీసీటీవీ కెమెరాల్లో ? !
బెంగళూరు/బెళగావి: మహిళకు రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ మొహం తండ్రి, అతని కుటుంబ సభ్యులు చూడనేలేదు. కడుపులో పుట్టిన బిడ్డను ఒక్కసారి మాత్రమే చూసుకున్న తల్లి మురిసిపోయింది. ఆసుపత్రిలో వార్డులో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లిన యువతి నేను ఇక్కడ నర్సు, మీకు పుట్టిన బిడ్డ బరువు ఎంత ఉన్నాడో అని చూడాలని డాక్టర్ చెప్పారని ఆమె చెప్పింది. బిడ్డను ఎత్తుకుని వెళ్లిన యువతి మాయం అయ్యింది, నా బిడ్డ ఎక్కడ అంటూ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని తల్లి అడిగింది. ఆసుపత్రిలో పని చేసే నర్సులు ఎవ్వరూ నీ బిడ్డను ఎత్తుకుని రాలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ తల్లి హడలిపోయింది.

ఆసుపత్రిలో చేరిన మహిళ
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని అథణిలో నివాసం ఉంటున్న మహిళకు బుధవారం రాత్రి పురిటినొప్పపులు వచ్చాయి. మహిళకు పురిటినొప్పులు రావడంతో ఆమెను అథణి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 9 గంటల సమయంలో ఆ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కడుపులో పుట్టిన బిడ్డను ఒక్కసారి మాత్రమే చూసుకున్న తల్లి మురిసిపోయింది.

బిడ్డతో మాయం అయిన నకిలీ నర్సు
బిడ్డ మొహం తండ్రి, అతని కుటుంబ సభ్యులు చూడనేలేదు. ఆసుపత్రిలో వార్డులో ఉన్న మహిళ దగ్గరకు వెళ్లిన యువతి నేను ఇక్కడ నర్సు, మీకు పుట్టిన బిడ్డ బరువు ఎంత ఉన్నాడో అని చూడాలని డాక్టర్ చెప్పారని ఆమె చెప్పింది. తరువాత బిడ్డను ఎత్తుకుని వార్డు నుంచి బయటకు వెళ్లిన నకిలీ నర్సు ఆసుపత్రిలో నుంచి బయటకు వెళ్లి మాయం అయ్యింది.

హడలిపొయిన తల్లి.... సీసీటీవీల్లో ?
బిడ్డను ఎత్తుకుని వెళ్లిన యువతి మాయం అయ్యింది, నా బిడ్డ ఎక్కడ అంటూ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని తల్లి అడిగింది. ఆసుపత్రిలో పని చేసే నర్సులు ఎవ్వరూ నీ బిడ్డను ఎత్తుకుని రాలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ తల్లి హడలిపోయి ఆర్తనాదాలు చేసింది. విషయం తెలుసుకున్న అథణి పోలీసులు ఆసుపత్రిలో, ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు.

మహారాష్ట్ర నుంచి వచ్చి బిడ్డను ఎత్తుకెళ్లిన కిలాడీ లేడి
పసుపు రంగు పంజాబి డ్రెస్ వేసుకున్న యువతి బిడ్డను ఎత్తుకుని వెళ్లిందని గుర్తించిన పోలీసులు బెళగావి జిల్లా పోలీసులు అందరికి సమాచారం ఇచ్చారు. బిడ్డను ఎత్తుకుని పారిపోతున్న యువతి చిక్కోడిలో పోలీసులకు చిక్కిపోయింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మహిశాళ గ్రామంలో నివాసం ఉంటున్న మాయా నీలాబాయి అలియాస్ నీలా (28) అనే యువతిని అరెస్టు చేసి బిడ్డను ఆమె తల్లికి అప్పగించామని పోలీసులు అన్నారు. సాంగ్లీ జిల్లా నుంచి వచ్చిన నీలాబాయి అప్పుడే పుట్టిన బిడ్డను ఎందుకు ఎత్తుకుని వెళ్లింది అని ఆమె చెప్పడం లేదని, విచారణ చేస్తున్నామని చిక్కోడి, అథణి పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications