Politics: ముస్లీం దేశాల్లో భారతీయల మీద వేటు వేస్తే ఏం చేస్తారు ?, ప్రభుత్వం మీద సొంత పార్టీ లీడర్ ఫైర్ !
బెంగళూరు/గోకాక్/ మైసూరు: మనదేశంలో, కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, అది మనకే మంచిది కాదనే విషయం ఎందుకు ఆలోచించడం లేదని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ విచారం వ్యక్తం చేశారు. ముస్లీం వ్యాపారులపై నిషేధం విదించడం ఎంత వరకు న్యాయం అని సొంతపార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ మండిపడ్డారు. ఇక్కడ ముస్లీం వ్యాపారులపై మన రాజకీయ నాయకులు నిషేధం విదిస్తున్నారు. ముస్లీం దేశాల్లో ఉంటున్న భారతీయుల మీద అక్కడి ప్రభుత్వాలు నిషేధం విదిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని, ముస్లీం దేశాల్లో ఉంటున్న భారతీయులు ఎక్కడికి వెలుతారు అనే విషయం మన రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించడం లేదో అనే విషయం తనకు అర్థం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ అన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే ముస్లీం వ్యాపారుల మీద నిషేధం విదించడం మనకే మంచిది కాదనే విషయం గుర్తు చేసుకోవాలని బీజేపీ లీడర్ హెచ్. విశ్వనాథ్ అన్నారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని కరావళి ప్రాంతాల్లో ముస్లీం వ్యాపారుల మీద స్థానికులు నిషేధం విదించారని, ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ సూచించారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మీద సొంత పార్టీ సీనియర్ నేత విమర్శలు చెయ్యడంతో అక్కడి ప్రభుత్వంలోని పెద్దలు, బీజేపీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. ఇటీవల హిజాబ్ వివాదంలో కూడా బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ సొంతపార్టీ నేతలను ఇరుకున పెట్టే విమర్శలు చెయ్యడం బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది.
Hijab Row: హిజాబ్ లు ముఖ్యం కాదు, పరీక్షలు ముఖ్యం అని చెప్పిన ముస్లీం అమ్మాయిలు, ఇంటికి వెళ్లి !
ముస్లీం వ్యాపారులపై నిషేధం
కర్ణాటకలోని కరావళి ప్రాంతంలో ఇటీవల జరిగిన జాతరల్లో ముస్లీం వ్యాపారులను స్థానికులు నిషేధించారు. హిజాబ్ వివాదంపై ముస్లీం నాయకులు ప్రవర్తించిన తీరును వ్యతిరేకిస్తూ జాతరల్లో ముస్లీం వ్యాపారులను బహిష్కరించారు. బెంగళూరు నగరంలోని హిందూ ఆలయాలు, దేవాదాయ శాఖకు చెందిన షాపుల్లో వ్యాపారం చేస్తున్న ముస్లీంల షాపులకు తాళం వెయ్యడం వివాదానికి కారణం అయ్యింది.
బీజేపీపై మండిపడిన సొంత పార్టీ నాయకుడు
కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, అది మనకే మంచిది కాదనే విషయం ఎందుకు ఆలోచించడం లేదని ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ విచారం వ్యక్తం చేశారు. ముస్లీం వ్యాపారులపై నిషేధం విదించడం ఎంత వరకు న్యాయం అని సొంతపార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ మండిపడ్డారు.
స్వార్థం కోసం చేస్తున్నారా ?
ముస్లీం వ్యాపారులపై నిషేధం విదించడం ఎంత వరకు న్యాయం అని సొంతపార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ మండిపడ్డారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం ఒకరిమీద ఒకరు విమర్శలు చేస్తున్నారని హెచ్. విశ్వనాథ్ ఆరోపించారు. ఒకరు దొంగ అంటే ఇంకొకరు తాగుబోతు అంటూ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, ఇది మంచిపద్దతి కాదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ విచారం వ్యక్తం చేశారు.
ముస్లీం దేశాల్లో నిషేధం విదిస్తే ఏం చేస్తారు ?
ఇక్కడ (కర్ణాటకలో) ముస్లీం వ్యాపారులపై మన రాజకీయ నాయకులు నిషేధం విదిస్తున్నారు. ముస్లీం దేశాల్లో ఉంటున్న భారతీయుల మీద అక్కడి ప్రభుత్వాలు నిషేధం విదిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని, ముస్లీం దేశాల్లో ఉంటున్న భారతీయులు ఖాళీ కడుపులతో ఎక్కడికి వెలుతారు అనే విషయం మన రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించడం లేదో అనే విషయం తనకు అర్థం కావడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ విచారం వ్యక్తం చేశారు.
గుజరి వ్యాపారుల మీద ప్రతాపం చూపిస్తున్నారా ?
గుజరీ
వ్యాపారం,
బిస్కెట్ల
వ్యాపారం,
ప్లాస్టిక్
వస్తులు
ఇలా
చిన్నచిన్న
వ్యాపారాలు
చేసుకునే
ముస్లీం
వ్యాపారుల
మీద
నిషేధం
విదించడం
మనకే
మంచిది
కాదనే
విషయం
గుర్తు
చేసుకోవాలని
బీజేపీ
లీడర్
హెచ్.
విశ్వనాథ్
అన్నారు.
బెంగళూరు
నగరంతో
పాటు
కర్ణాటకలోని
కరావళి
ప్రాంతాల్లో
ముస్లీం
వ్యాపారుల
మీద
స్థానికులు
నిషేధం
విదించారని,
ఈ
విషయంలో
కర్ణాటక
ప్రభుత్వం
జోక్యం
చేసుకోవాలని
బీజేపీ
ఎమ్మెల్సీ
హెచ్.
విశ్వనాథ్
సూచించారు.
బిత్తరపోయి బీజేపీ నాయకులు
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మీద సొంత పార్టీ సీనియర్ నేత విమర్శలు చెయ్యడంతో అక్కడి ప్రభుత్వంలోని పెద్దలు, బీజేపీ కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. ఇటీవల హిజాబ్ వివాదంలో కూడా బీజేపీ ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ సొంతపార్టీ నేతలను ఇరుకున పెట్టే విమర్శలు చెయ్యడం బీజేపీ వర్గాల్లో కలకలం రేపింది.