బ్లాక్ మెయిల్: టీవీ చానల్ యజమానితో సహ ఆరు మంది అందర్: భార్య పేరుతో!
బెంగళూరు: టీవీ చానల్ ప్రారంభించి రహస్యంగా వీడియోలు చిత్రీకరించి వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆరు మందిని బెంగళూరు నగరంలోని బనశంకరి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. నిందితుల నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రజాప్రతినిధి చానల్ యజమాని సంతోష్ తో సహ ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు. బనశంకరిలోని పాపారెడ్డిపాళ్యలో సంతోష్ నివాసం ఉంటున్నాడు. గతంలో సంతోష్ ప్రజాప్రతినిధి అనే పత్రిక నిర్వహించేవాడు.

ప్రజాప్రతినిధి పత్రికను నిలిపివేసిన సంతోష్ 8 నెలల క్రితం అతని భార్య అశ్విని పేరు మీద ప్రజాప్రతినిధి అనే టీవీ చానల్ ప్రారంభించాడు. ప్రజాపత్రినిధి టీవీ చానల్ ను బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం చెయ్యాలని సంతోష్ నిర్ణయించి స్నేహితులతో కలిసి మామూళ్లు వసూళ్లు చెయ్యాలని నిర్ణయించాడు.

బనశంకరికి చెందిన బట్టల వ్యాపారి అమిత్ అనే వ్యక్తిని బెందిరించి అక్రమంగా భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తరువాత సంతోష్ తన స్నేహితులు అశోక్ కుమార్, నవీన్, రోహిత్, మహదేవ్ తదితరులతో కలిసి బనశంకరి, యలహంక తదితర ప్రాంతాల్లో బట్టల దుకాణాల్లో వీడియోలు చిత్రీకరించి వారిని బెదిరించి మోసం చేసి అక్రమంగా నగదు వసూలు చేశారు. బాధితుడు అమిత్ ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కాప్లాన్ తో నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications