Beautiful wife: భార్య దొండపండులా ఉందని భర్తకు అనుమానం, అర్దరాత్రి ఒకే సారి, ఆవేశం తట్టుకోలేక !
చెన్నై/ కాంచీపురం: భార్య మీద అనుమానంతో భర్త రోజు ఇంట్లో టార్చర్ పెట్టాడు. ప్రతిరోజూ ఇంట్లో భార్య,భర్తల మద్య ఇదే పంచాయితీ జరిగింది. పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా దంపతుల రామాయణం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్లకు చెప్పిచెప్పి విసిగి అయారు. ఇక లాభం లేదని భావించిన భార్య ఆవేశంతో అర్దరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్ రూమ్ కు వెళ్లాలని నిద్రలేచిన భర్త తన భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసుల భయంతో ఏం చెయ్యాలో అర్థంకాక సతమతం అయిపోయి నిద్రమత్తులో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.

కాంచీపురంలో దంపతులు
తమిళనాడులోని కాంచీపురం సమీపంలోని కుప్పమ్మల్ వినాయకపురంలో కదిరివేల్, మణిమంగలై దంపతులు నివాసం ఉంటున్నారు. కదిరివేల్, మణిమంగలై దంపతులకు ముత్తు (8) అనే కుమారుడు, సుహాసిని (4) అనే కుమార్తె ఉన్నారు. పెళ్లి జరిగిన తరువాత కదిరివేల్, మణిమంగలై దంపతులు హ్యాపిగా సంసారం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వీరి సంసారం కొంతకాలం సాఫీగానే సాగిపోయింది.

భార్య దొండపండులా ఉందని ?
మణిమంగలై చూడటానికి ఎర్రగా, బొద్దుగా ఉంటుంది. కదిరివేల్ కాంచీపురంలోనే టైల్ వ్యాపారం చేస్తున్నాడు. ఉదయం నిద్రలేచి ఇంట్లో టిఫిన్ చేసి వ్యాపారం చెయ్యడానికి బయటకు వెళ్లే కదిరివేల్ రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఇదే సమయంలో చూడటానికి దొండపండులా ఉండే భార్య మణిమంగలై తనతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త కదిరివేల్ కు అనుమానం పెరిగిపోయింది.

ఓసేయ్..... నిన్ను లేపేస్తా
రాత్రి ఇంటికి వెలుతున్న కదిరివేల్ నేను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ? వాళ్లకు నీతో ఏం పని అంటూ భార్య మణిమంగలైతో గొడవపడేవాడు. తాను ఎవరితో తిరగడం లేదని, నువ్వు తప్పా నాతో ఎవ్వరూ సంసారం చెయ్యడం లేదని, అనవసరంగా గొడవలు చెయ్యకూడదని భార్య మణిమంగలై భర్త కదిరివేల్ కు ఎదురుతిరిగింది.

విసిగిపోయిన ఫ్యామిలీ
ఇలా కొంతకాలం నుంచి కదిరివేల్, మణిమంగలై దంపతుల మద్య గొడవలు తారస్థాయికి చేరాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కదిరివేల్, మణిమంగలై దంపతులకు బుద్దిమాటలు చెబుతూ వచ్చినా వారి మద్య గొడవలు మాత్రం తగ్గలేదు. మీ చావు మీరు చావండి అంటూ బంధువులు కూడా కదిరివేల్, మణిమంగలైని వదిలేశారు.

అర్దరాత్రి భర్తకు షాక్
అక్రమ సంబంధం అనుమానం విషయంలోరాత్రి గొడవ పడిన కదిరివేల్, మణిమంగలై తరువాత రెండు గదుల్లోకి వెళ్లి నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత మణిమంగలై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అర్దరాత్రి దాటిన తరువాత బాత్ రూమ్ కు వెళ్లాలని నిద్రలేచిన కదిరివేల్ భార్య ఉరి వేసుకున్న విషయం గుర్తించి షాక్ అయ్యాడు.
Recommended Video

పోలీసుల భయంతో భర్త ఆత్మహత్య
ఎక్కడ పోలీసులు పట్టుకుని జైలుకు పంపిస్తారో అనే భయంతో ఆందోళన చెందిన కదిరివేల్ గట్టిగా కేకలు వేస్తూ వేరే గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కదిరివేల్ కేకలు వెయ్యడంతో బంధువులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకే రోజు తల్లిదండ్రలు ఆత్మహత్య చేసుకోవడంతో కదిరివేల్, మణిమంగలై ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications