Coronavirus: ఉప ముఖ్యమంత్రి కొడుక్కి సీరియస్, విమానంలో హైదరాబాద్ షిఫ్ట్, ఫ్యామిలీలో 8 మంది !
హైదరాబాద్/ బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు హడలిపోయారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుటుంబ సభ్యులు 8 మంది కరోనా వైరస్ (COVID-19) వైద్యపరీక్షలు చేయించుకోవడంతో అందరూ ఆ మహమ్మారి బారినపడ్డారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ (43) కు కోవిడ్ 19 పాజిటివ్ అని తేలడం, వెంటిలేటర్ పై ఉన్న ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు.
ఇటీవల కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కుమార్తె, ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ బారినపడి చికిత్స చేయించుకుని ఆ మహమ్మారి వ్యాధిని నయం చేసుకున్నారు.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ఈ విషయంపై ట్విట్ చేశారు. తన కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ గత 23 రోజుల నుంచి కరోనా వైరస్ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. తాను 19 రోజుల పాటు కరోనా వైరస్ చికిత్స చేయించుకుని వ్యాధి నయం చేసుకున్నానని, తన భార్య కరోనా వైరస్ నుంచి కోలుకుందని, తన కుటుంబంలో మొత్తం 8 మంది కరోనా వైరస్ బారినపడ్డామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ట్విట్ చేశారు.
కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలోని ముధోల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ ఆ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా పని చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ కుమారుడు డాక్టర్ గోపాల్ కరజోళ 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నాగాథన్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత 23 రోజుల నుంచి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న గోపాల్ కరజోళకు వ్యాధి నయం కాకపోతే ఆయన ఉపిరితిత్తులు మార్చవలసి ఉంటుందని వైద్యులు సూచించారని కర్ఱాటక ఉప ముఖ్యమంత్రి గోవింద కరజోళ వివరించారు.
-
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications