అజీమ్ ప్రేమ్జీ ఓకే అంటే బెంగళూరు విప్రో క్యాంపస్ గుండా ట్రాఫిక్
మొన్నటికి మొన్న.. బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులు, అధ్వానంగా మారిన రోడ్ల కారణంగా జెయింట్ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తొమ్మిది సంవత్సరాలుగా బెల్లందూరు అవుటర్ రింగ్ రోడ్డులో గల ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయనుంది. మరో ప్రాంతానికి రీలొకేట్ కానుంది. రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోండటం, రోడ్లు అత్యంత దయనీయంగా మారడం, ఆఫీస్ కు వెళ్లడానికి ఉద్యోగులకు గంటన్నరకు పైగా సమయం పడుతోండటం వల్ల ఈ నిర్ణయానికొచ్చింది.
ఈ పరిస్థితుల మధ్య.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రంగంలోకి దిగారు. అవుటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ ను రెగ్యలరేట్ చేయడానికి చర్యలు తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా- విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్జీకి లేఖ రాశారు. ఔటర్ రింగ్ రోడ్ (ORR)లోని ఇబ్బలూరు జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి క్యాంపస్ గుండా వాహన రాకపోకలకు అనుమతివ్వాలని కోరారు. విప్రో క్యాంపస్ ద్వారా పరిమితంగా వాహన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గుతుందని, పీక్ అవర్స్లో రద్దీని తగ్గించవచ్చని సిద్ధరామయ్య తెలిపారు. పరస్పర అంగీకారంతో కూడిన నిబంధనలు, భద్రతాపరమైన అంశాలకు లోబడి విప్రో క్యాంపస్ గుండా వాహనాల రాకపోకలకు అనుమతించే అవకాశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్, అర్బన్ మొబిలిటీ నిపుణుల ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ చర్య ORR లోని ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో రద్దీని దాదాపు 30 శాతం తగ్గించగలదని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా కార్యాలయ పనివేళల్లో ఈ తగ్గింపు ప్రభావం ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు. ఈ పరిణామం బెంగళూరులో ప్రయాణికులు, ఉద్యోగుల సమయాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించడానికి కొంత మేర వెసలుబాటటు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. నగరాన్ని మరింత సమర్థవంతంగా వాహనాల రాకపోకలను నిర్వహించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులతో కలిసి పని చేయాలని విప్రో యాజమాన్యాన్ని కోరారు.
పీక్ అవర్స్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ వల్ల ప్రయాణ సౌలభ్యం, ఉత్పాదకత, పట్టణ జీవన నాణ్యత దెబ్బతింటున్నాయని సిద్ధరామయ్య అంగీకరించారు. బ్లాక్బక్ సీఈఓ రాజేష్ యాబాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ పై నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తిన నేపథ్యంలో సిద్ధరామయ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్ లో వాహనాల రాకపోకలపై నివేదిక తెప్పించుకున్నారు. గత ఏడాదితో ఈ సంవత్సరం జూన్ 2025లో ఔటర్ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ 45 శాతం పెరిగింది.
-
"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్" -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్











Click it and Unblock the Notifications