భారత్ మాతా మందిర్: ఇక్కడికి వెళ్తే అఖండ భారత్ కనిపిస్తుంది
వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశిలో భారతమాత ఆలయం ఉంది. ఏ ఆలయంలోనైనా లేదా ప్రార్థనాలయంలోనైనా అక్కడ దేవుడు లేదా దేవత ఉంటారు. కానీ ఇక్కడి ఆలయానికి వెళ్తే ఏ దైవమూ కనిపించదు. దేశభక్తిని నింపేలా అద్భుతం సాక్షాత్కరిస్తుంది.
భారతమాతను కళ్లెదుట నిలిపేందుకు ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు శివప్రసాద్ గుప్తా దీని కోసం కృషి చేశారు. ఇక్కడ అఖండ భారత్ ఉంటుంది. మహాత్మా గాంధీ విద్యాపీఠం ఆవరణలో శివప్రసాద్ గుప్తా అనే సమరయోధుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.
1918 నుంచి 1924 మధ్య వరకు దీని నిర్మాణం సాగింది. ఆ తర్వాత పన్నెండేళ్లకు మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు. భారత్ దేశం చిత్రపటం అంటే మనకు ఉత్తరాన హిమాలయాలు, ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్ కనిపిస్తాయి.

కానీ అఖండ భారత్ అంటే ప్రాచీన భారతం. ఆప్గనిస్తాన్ను గాంధార దేశంగా భావిస్తారు. ఇలా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్లతో కూడిన భారత్ను అఖండ భారత్ అంటారు. ఇది ప్రాచీన భారతం అసలు స్వరూపం.
కాశీలో ఉన్న ఈ ఆళయంలో అడుగు పెడితే భారతమాత చిత్రపటం కళ్లముందు కనిపిస్తుంది. మార్బుల్తో అవిభాజ్య భారతం చూడవచ్చు. రాజస్థాన్లో దొరికే అరుదైన మక్రానా మార్బుల్తో భారత చిత్రపటాన్ని రూపొందించారు. దీనికి పలువురు నేతలు కూడా నిధులు విరాళంగా ఇచ్చారు.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications