Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ బంద్ - ఏపీ ప్రభుత్వం మద్దతు : బస్సులు-స్కూళ్లు నిలిపివేత : రోడ్లపైకి విపక్ష నేతలు..!!

దేశ వ్యాప్తంగా భారత్ బంద్ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ కొనసాగనుంది. ఏపీలో బీజేపీ - జనసేన మినహా అన్ని పార్టీలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్‌మోర్చా తలపెట్టిన భారత్‌ బంద్‌కు ఏపీలోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఏపీ ప్రభుత్వం సైతం బంద్ కు సంఘీభావం తెలిపింది. అందులో భాగంగా..మధ్నాహ్నం వరకు బస్సులను నిలిపివేస్తూ నిర్ణయించింది.

బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు

బంద్ కు ఏపీ ప్రభుత్వం మద్దతు

పాఠశాలలు సైతం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్నాహ్నం ఒంటి గంట తరువాత తిరిగి బస్సులు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ తో పాటుగా టీడీపీ - వామపక్ష పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొననున్నాయి. ఇక, తెలంగాణలో ప్రభుత్వం నుంచి బంద్ పైన అధికారిక ప్రకటన లేదు. కాంగ్రెస్ - వామపక్షాలు మాత్రం సయుక్తంగా బంద్ సక్సెస్ చేసేందుకు రంగంలోకి దిగాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొననున్నారు. ఏపీలో కొన్ని జిల్లాల్లో సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమాలను వాయిదా వేశారు.

బీజేపీ-టీఆర్ఎస్-జనసేన మినహా

బీజేపీ-టీఆర్ఎస్-జనసేన మినహా

బంద్‌కు వైకాపా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మిషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. తమ పార్టీ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. సీపీఎం, సీపీఐ సహా అన్ని వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ బంద్‌లో పాల్గొననున్నాయి. ఇక, జాతీయ స్థాయిలోనూ బంద్ సక్సెస్ చేసేందుకు..రైతులకు మద్దతు బీజేపీ వ్యతిరేక పార్టీలన్న ముందుకు వచ్చాయి. 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఇచ్చిన భారత్‌ బంద్‌లో పాల్గొంటామని కాంగ్రెస్‌, ఆప్‌, సమాజ్‌వాదీ, వామపక్షాలు, బీఎస్పీ తెలిపాయి.

మరో పదేళ్లపాటు అయినా కొనసాగిస్తామంటూ

మరో పదేళ్లపాటు అయినా కొనసాగిస్తామంటూ

10 నెలలుగా ఉద్యమిస్తున్న తాము అవసరమైతే పదేళ్లపాటు దాన్ని కొనసాగించడానికి సిద్ధమేగానీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను అమలు కానిచ్చేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ స్పష్టం చేశారు. డిమాండ్లను అంగీకరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామన్నారు. ట్రాక్టర్లను సిద్ధం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఇప్పటివరకు 11 విడతలుగా జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి, రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బంద్‌కు ఎస్‌కేఎం ఏర్పాట్లు చేసింది.

బందోబస్తు ముమ్మరం

బందోబస్తు ముమ్మరం

బంద్‌ పిలుపు నేపథ్యంలో దిల్లీలో పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. ఇండియా గేట్‌, విజయ్‌చౌక్‌ సహా ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. నిరసన శిబిరాల నుంచి ఎవరూ దేశ రాజధానిలోకి రాకుండా చర్యలు చేపట్టారు. దిల్లీలోకి వచ్చే ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఉదయం 6నుంచి సాయంత్రం 4గంటల వరకు బంద్‌ పాటిస్తామని, అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని ఎస్‌కేఎం తెలిపింది.

Recommended Video

    Interview with Praja Sangala leader Sagar On 27 Bandh | Oneindia Telugu
    రోడ్ల పైకి కాంగ్రెస్ - వామపక్ష పార్టీల నేతలు

    రోడ్ల పైకి కాంగ్రెస్ - వామపక్ష పార్టీల నేతలు

    దీంతో..బంద్ సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ - వామపక్షాలతో పాటుగా మద్దతిస్తున్న పార్టీల నేతలు రోడ్ల పైకి వస్తున్నారు. బస్సులను డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ లో బంద్ కు మద్దతుగా వామపక్షాల ర్యాలీ కొనసాగనుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బస్సులు యధావిధిగా నడుస్తాయని..ఇతర రాష్ట్రాలకు వెళ్లేవి సైతం నడుపుతామని ప్రకటించింది. ఢిల్లీ - అంబాలా రైల్వే లైను బ్లాక్ చేయటానికి అదే విధంగా జాతీయ రహదారి 44 పైన రాకపోకలను నిలిపివేయాలని సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయించింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+