వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో కొత్తగా ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. న్యాయమూర్తుల నియామకం, బదలీల వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.

ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన న్యాయమూర్తుల నియామక బిల్లుకు లోకసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం మోడీ ప్రభుత్వానికి పెద్ద విజయమని చెప్పవచ్చు.

ఈ బిల్లు నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు కానుంది. దేశంలోని పలు కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవహారాలను ఈ కమిటీయే చూస్తుంది. ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో ఈ కమిటీ కొత్తగా ఏర్పాటవుతోంది.

Big win for NDA govt as Lok Sabha passes Judicial Appointments Bill

న్యాయవ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోందంటూ కొన్ని రోజుల కిందట ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్, జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇందుకు మద్దతు తెలిపిన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని తీసుకొస్తోంది.

ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే, రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బలం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బిల్లులో కాంగ్రెస్ పార్టీ కొన్ని సవరణలు డిమాండ్ చేసే అవకాశముంది.

English summary
The National Judicial Appointments Commission Bill, 2014 was passed in Lok Sabha on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X