Bihar Results 2025: ఫలితాల వేళ బీహార్ లో కీలక పరిణామాలు-సీసీ కెమెరాలు ఆఫ్..!
బీహార్ అసెంబ్లీలోని 243 సీట్లకు ఈసారి రెండు దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నానికి ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విపక్ష మహాకూటమి అప్రమత్తమైంది. భారీ ఎత్తున ఆర్జేడీ శ్రేణుల్ని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్దకు తేజస్వీ యాదవ్ పంపుతున్నారు.
బీహార్ లో రెండో విడత ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలను ఎన్నికల సిబ్బంది తరలించారు. అక్కడ రేపటి వరకూ వాటిని భద్రపర్చాల్సి ఉంది. రేపు ఉదయం కౌంటింగ్ సమయంలో వీటిని తెరిచి ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాల్సి ఉంది. వీటిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు భారీ భద్రత కల్పించారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంత భద్రత మధ్య కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

भागलपुर जिले के मतगणना केंद्र के CCTV कैमरा नंबर 7 और 27, दोनों कैमरों से कहलगांव विधानसभा के EVM वाले स्ट्रांग रूम का फीड मिल रहा था, घंटों से बंद है।
— Tejashwi Yadav (@TejashwiYdvRJD) November 13, 2025
ऊपर से नीचे तक कोई भी अधिकारी कुछ भी जवाब नहीं दे रहा है!
इतना ही नहीं, इसे जल्द से जल्द ठीक करवाने का भी घंटों से कोई भी… pic.twitter.com/dzcwGWg7z7
ఇవాళ బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటిని ఎన్నికల అధికారులు లైవ్ లో ఉంచారు. అయితే లైవ్ మధ్యలో ఆటంకాలు ఏర్పడి పలు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కెమెరాలు బ్లాంక్ గా కనిపిస్తున్నాయి. అలాగే పలు చోట్ల అసలు సీసీ కెమెరాలు ఓపెన్ కావడం లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీంతో బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు లోపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

सासाराम में आधी रात में बक्से से भरा हुआ ट्रकस्ट्रॉंग रूम के अंदर घुसा।
— Tejashwi Yadav (@TejashwiYdvRJD) November 13, 2025
आखिर प्रशाशन घुसने कैसे दिया?
ट्रक चालकों को सामने लाए बिना क्यों भगा दिया गया? 2 बजे से यहां CCTV कैमरा का फीड क्यों बंद रहा?
पूरा फुटेज जारी किया जाए!
ट्रक में क्या है प्रशासन बताए!@CEOBihar @ECISVEEP… pic.twitter.com/6oZ11qw0tg
మరోవైపు ఉదయం ససారాంలోని ఈవీఎంలు భద్రపరిచిన ఓ స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఓ అనుమానాస్పద ట్రక్ వచ్చింది. ఇందులో భారీ ఎత్తున ట్రంకు పెట్టెలు ఉన్నాయి. వీటిని దింపుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే దాని వివరాలు అడిగితే ఇవ్వడం లేదంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. అలాగే పలు చోట్ల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదని ఆయన వీడియో తీసి మరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అసలే బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయే విజయం తథ్యమని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చెప్పేశాయి. దీన్ని నిజం చేసేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు తేజస్వి ఆరోపిస్తున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications