ఢిల్లీలో బిజెపిVsకేజ్రీవాల్ పార్టీ: కాంగ్రెస్కు ఒక్క స్థానం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఎఎపి ఢిల్లీలో రెండు నుండి నాలుగు స్థానాలు దక్కించుకుంటుంది. బిజెపి కూడా అన్నే సీట్లు దక్కించుకునే అవకాశాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెసు ఏడు స్థానాలలో గెలుపొందింది. ఇప్పుడు ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంటుంది.
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పిఎంగా చూడాలనుకుంటున్న వారు 37 శాతం, కేజ్రీవాల్ను ఢిల్లీ పీఠంపై చూడాలనుకుంటున్న వారు 26 శాతం, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని చూడాలనుకుంటున్న వారు 15 శాతం ఉన్నారు. అయితే, కేజ్రీవాల్ను ప్రధానిగా చూడాలనుంటున్న వారి సంఖ్య తగ్గింది.
జనవరిలో 35 శాతం మంది కేజ్రీవాల్ను ప్రధానిగా చూడాలనుకున్నారు. ఇప్పుడు తొమ్మిది శాతం తగ్గింది. సర్వే ప్రకారం... మహారాష్ట్రలో బిజెపి-శివసేన-ఆర్పీఐ కూటమి 23 నుండి 29 లోకసభ స్థానాలు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్-ఎన్సీపి కూటమి 16 నుండి 22 సీట్లు దక్కించుకుంటాయి.