యూపీలో మళ్లీ బీజేపీయే.. యోగికి పట్టం కట్టబోతున్న ఓటర్లు.. ఏబీపీ సీ ఓటర్ సర్వే
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నిమగ్నమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల గురించి ఏబీపీ సీ ఓటర్ సర్వే చేపట్టింది. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఏబీసీ సర్వే చేపట్టింది. ఈ రోజు యూపీలో ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం చేపడుతోందని తెలిపింది. బీజేపీకి భారీ మెజార్టీ దక్కుతోందని వివరించింది. 2017 మాదిరిగానే విజయం ఖరారు అవుతోందని.. ఇందులో సందేహానికి తావులేదని చెప్పింది.
మమత పెద్ద రిగ్గింగ్ రారాణి -ఈవీఎం యంత్రాలపై సాకులా? -బెంగాల్ సీఎంపై బీజేపీ నేత సువేందు ఫైర్
యూపీలో 403 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 289 చోట్ల విజయం సాధిస్తోందని ఏబీపీ సర్వే తెలిపింది. అయితే 2017లో మాత్రం 325 చోట్ల గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఓటర్ల విశ్వసనీయతను కోల్పోయారని పేర్కొన్నది. 2021 మార్చి ప్రకారం ఎస్పీకి 59, బీఎస్పీ 38 సీట్లు, కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది.
సీఎంగా యోగి ఆదిత్యనాథ్ వైపు జనం సంతృప్తితో ఉన్నారు. ఈ రోజు ఎన్నిక జరిగినా.. బీజేపీకి 41 శాతం ఓటుతో విజయం సాధిస్తోందని పేర్కొన్నది. ఎస్పీ ఓటు షేర్ మాత్రం 24.4 శాతం ఉంది. బీఎస్పీ 20.8 శాతం, కాంగ్రెస్ 5.9 శాతం షేర్ కలిగి ఉంది.