Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ హైకమాండ్ త్వరలో ఇద్దరి పేర్లు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూపులు !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా బీజేపీ ప్రతిపక్ష నేత పేరును ఇంత వరకు ప్రకటించలేదు. ప్రతిపక్ష నాయకుడి పదవి కూడా బీజేపీ అమ్ముకుంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్ నేతల బీజేపీ హైకమాండ్ ను అవహేళనలు చేస్తున్నారు.

కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన బాధ్యత కూడా బీజేపీ హైకమాండ్‌దే అని అందరికి తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న మాజీ మంత్రి సీటీ రవి పేరు, కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నేతగా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ పేర్లు బీజేపీ హైకమాండ్ ముందు చర్చకు వచ్చాయని తెలిసింది.

BJP

ఈ ఇద్దరి పేర్లను బీజేపీ హైకమాండ్ నాయకులు పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన బీజేపీ హైకమాండ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కుల సమీకరణాల లెక్కింపులో మళ్లీ నిమగ్నమైందరి తెలిసింది. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతలను లింగాయత్, ఒక్కలిగ కులాల నాయకులను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

BJP

కర్ణాటటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కర్ణాటకలో బీజేపీ వాస్తవంగా నాయకత్వాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నేత లేకుండానే అసెంబ్లీ నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నళిన్‌కుమార్‌ కటీల్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. తాను తన పదవికి రాజీనామా చేస్తానని నళిన్ కుమార్ కటీల్ కూడా ప్రకటించారు.

BJP
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పలువురు నాయకుల పేర్లు వినిపించాయి. ఒక్కలిగ కులంలో మాజీ డీసీఎంలు ఆర్. అశోక్, డాక్టర్ సీఎన్. అశ్వత్థనారాయణ, లింగాయత్ కులంలో మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర వంటి నేతల పేర్లు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కలిగ వర్గానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు వీ. సోమన్న తనకు కర్ణాటక బీజేపీ అధ్యక్ష పదవి కావాలని ఇప్పటికే డిమాండ్ చేశారు.

మాజీ మంత్రి వీ. సోమన్న అయితే ఇప్పటికే బీజేపీ జాతీయ నేతలకు ఈ విషయంలో లేఖ పంపారు. కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవి నాకు కావాలని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. కర్ణాటక మాజీ సీఎం బసవరాజక బోమ్మయ్ , మాజీ మంత్రి సునీల్ కుమార్ పేర్లు కూడా ప్రతిపక్ష నాయకుడిగా నియమించాలనే ప్రతిపాధనలు బీజేపీ హైకమాండ్ ముందకు వెళ్లాయి.

BJP
కర్ణాటక మాజీ సీఎం. బీఎస్ యడ్యూరప్ప తనయుడు, శికారిపుర ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర జాతీయ నేతతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డాతో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి చర్చించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద కర్ణాటకలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి పేరు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పేర్లు ప్రకటించడానికి బీజేపీ హైకమాండ్ సిద్దం అవుతోందని తెలిసింది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+