మోదీకి చాన్స్ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, బాంబు పేల్చిన ఎంపీ, బీజేపీ ఏం చెప్పిందంటే ?
బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పదవ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించారు. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక బీజేపీ ఎంపీ మరో వివాదాన్ని సృష్టించి సైలెంట్ అయిపోయారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో దూమరం రేపింది. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలతో సొంత పార్టీ నేతలు ఉలిక్కిపడ్డారు.
కేంద్రంలో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి మళ్లీ కేంద్రంలోకి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కర్ణాటక బీజేపీ స్పందిస్తూ రాజ్యాంగం సవరణపై ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన ప్రకటనలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని, ఆయన వ్యాఖ్యలను మా పార్టీ వైఖరిని ప్రతిబింబించడం లేదని, ఆయన మాటలను మేము సమర్థించడం లేదని స్పష్టం చేసింది.

దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న మా నిబద్ధతను బీజేపీ పునరుద్ఘాటిస్తోందని కర్ణాటక బీజేపీ స్పష్టం చేసింది. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమని కర్ణాటక బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చెప్పారు. కాంగ్రెస్ ప్రాథమికంగా రాజ్యాంగంలో అనవసరమైన విషయాలను నింపిందని, ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణిచివేసేందుకు ఉద్దేశించిన చట్టాలను ప్రవేశపెట్టడం ద్వారా రాజ్యాంగాన్ని వక్రీకరించిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే ఆరోపించారు.

ఇవన్నీ మార్చాలంటే బీజేపీకి ఇప్పుడున్న మెజారిటీతో అది సాధ్యం కాదని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని సవరించాలంటే బీజేపీ 20కి పైగా రాష్ట్రాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావిస్తూ లోక్సభలో, ఆపై రాజ్యసభలో నిరంతర ప్రయత్నాల ద్వారా ఆమోదించబడిందని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అన్నారు. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించకపోవడంతో అది అమలు కాలేదని ఆయన చెప్పారు.

కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అనంత్కుమార్ హెగ్డే వ్యాఖ్యలపై కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ స్పందించారు. బీజేపీ రాజ్యాంగ విరుద్ధమైన పార్టీ అని అనంతకుమార్ హెగ్డే మాటలు వింటే అర్థం అవుతోందని డీకే శివకుమార్ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్దం అవుతోందని మరోసారి వెలుగు చూసిందని, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చెయ్యడానికి సిద్దం అయ్యారని డీకే శివకుమార్ ఆరోపించారు. 2017లో అప్పటి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేసిన అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించి వివాదం సృష్టించారు. ఆ తర్వాత లోక్సభలో అనంతకుమార్ హెగ్డే క్షమాపణలు చెప్పి తన ప్రకటనను వక్రీకరించారని రివర్స్ గేర్ వేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications