రాహుల్ గాంధీలా మాట్లాడి మిమిక్రీ చేసిన అమిత్ షా, వీడియో వైరల్, ఏం ట్యాలెంట్!
Recommended Video

బీదర్/బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరం చేస్తూ ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కార్యకర్తలను నవ్వుల్లో ముంచెత్తారు.

ఉత్తర కర్ణాటక
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు ఉత్తర కర్ణాటకలో ముమ్మరంగా ప్రచారం చేశారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

లోకల్ బాషలో మూడు ముక్కలు
కర్ణాటకలో ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వీరిద్దరూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో రెండు మూడు ముక్కలు కన్నడ బాషలో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.
అమిత్ షా మిమిక్రీ
బీదర్ లో బీజేపీ ఏర్పాటు చేసిన నవశక్తి సమావేశ కార్యక్రమంలో అమిత్ షా రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతున్నారో అలాగే మిమిక్రీ చేస్తూ మాట్లాడటంతో బీజేపీ కార్యకర్తలు నవ్వు ఆపుకోలేకపోయారు. రాహుల్ గాంధీలాగా అమిత్ షా మిమిక్రీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమిత్ షా మిమిక్రీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వ్యక్తిగత విమర్శలు
ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేసిన అమిత్ షా, రాహుల్ గాంధీ ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. మహాదాయి నదీ నీటి పంపిణి వివాదం, లింగాయత్ ధర్మం తదితర అంశాలు అమిత్ షా, రాహుల్ గాంధీ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దానం నాగేందర్కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications