మోదీ మంత్రాంగం: అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు: లిస్ట్ రిలీజ్
భోపాల్: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది భారతీయ జనతా పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరంలల్లో అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మధ్యప్రదేశ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలయ్యారు కమలనాథులు.

ఈ పరిణామాల మధ్య- మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోయే 39 మంది అభ్యర్థులతో కూడిన మలి జాబితాను విడుదల చేసింది బీజేపీ. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ.. ఆ తరువాత చేపట్టిన ఆపరేషన్ లోటస్ సహకారంతో కమల్నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయగలిగింది.
కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు సంపూర్ణ మెజారిటీని సాధించి.. ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. దీనికోసం కట్టుదిట్టమైన వ్యూహాలను రచించుకుంటోంది. కాంగ్రెస్ను ఓడించడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.

ఇందులో భాగంగా ముగ్గురు కేంద్ర మంత్రులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్థే పేర్లను మలి జాబితాలో చేర్చింది.
మొరెనా లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నరేంద్ర సింగ్ తోమర్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దిమానీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ సొంత లోక్సభ స్థానం దమో కాగా.. ఆయనకు నర్సింగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది బీజేపీ. ఫగ్గన్ సింగ్ కులస్తే.. 2019 ఎన్నికల్లో మంద్లా నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడాయన నివాస్ సీటు నుంచి అసెంబ్లీ బరిలో దిగనున్నారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!












Click it and Unblock the Notifications