యడ్డీకి బిజెపి గ్రీన్సిగ్నల్, రెడీ: శ్రీరాములుకు ఛాన్స్
బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తిరిగి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేందుకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకుడు ఈశ్వరప్ప ఆదివారం చెప్పారు. యడ్డీకి అధిష్టానం పచ్చజెండా ఊపిందని, ఆయన త్వరలో పార్టీలోకి వస్తారని ఆకాంక్షించారు.
ఈశ్వరప్ప బళ్లారీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర బిజెపి నాయకత్వం ఆయన రాక కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. పార్టీలో చేరేందుకు యడ్డీ ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని పిఎంను చేయాలనే ఏకైక లక్ష్యంతో బిజెపిలో తిరిగి చేరుతున్నట్లు యెడ్యూరప్ప ప్రకటించారని, దాన్ని తాను స్వాగతిస్తున్నామన్నారు. కాగా, సొంత గూటికి చేరనున్నట్లు యడ్డీ కూడా సూత్రప్రాయంగా ప్రకటించారు.
మరోవైపు బిఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత శ్రీరాములును కూడా బిజెపిలో చేర్చుకునే అంశంపై అగ్ర నాయకత్వంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈశ్వరప్ప పేర్కొన్నారు. అయితే ఆయన చేరికపై ఇంకా ఎలాంటి సంకేతం అందలేదన్నారు. వాల్మీకి కమ్యూనిటీలో బలమైన నాయకుడుగా శ్రీరాములుకు పేరుంది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications