"ఇది మోడీ వేవ్ కాదు, ఈవీఎం వేవ్!.. ఢిల్లీ విజయం వెనుక ట్యాంపరింగ్"
'బీజేపీకి లభించిన ఈ విజయం మోడీ వేవ్ కాదు.. ఈవీఎం వేవ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓటు పడేలా ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఆరోపణలు చేయగా.. మాజీ సీఎం అఖిలేశ్ సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గొంతు కలిపారు.
ఇక తాజా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోను బీజేపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో ఆప్ పరాభవానికి ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్లే(ఈవీఎం) కారణమని ఆ పార్టీ ఆరోపించింది. ఇదే విషయంపై ఆప్ నేత గోపాల్ రాయ్ మీడియాతో మాట్లాడారు.

'బీజేపీకి లభించిన ఈ విజయం మోడీ వేవ్ కాదు.. ఈవీఎం వేవ్' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓటు పడేలా ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. అందువల్లే బీజేపీకి ఇంతటి విజయం దక్కిందన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్రమంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
దేశ ప్రజలంతా బీజేపీనే బలంగా కోరుకుంటున్నారని, అదే విషయం మరోసారి రుజువైందని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే, తాజా ఢిల్లీ ఎన్నికల ఫలితాల తీరును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు తమ ఇళ్ల నుంచే పరిశీలించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications