Milkipur By Election: ఓటమికి ప్రతీకారం.. మిల్కిపూర్ లో బీజేపీ ఘన విజయం

Milkipur By Election: ఉత్తరప్రదేశ్ లోని మిల్కిపూర్ ఉపఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాశ్వాన్ 60 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. 30 రౌండ్ల కౌంటింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ ను ఓడించారు. ఎస్పీకి చెందిన అజిత్ ప్రసాద్ ప్రారంభం నుంచి వెనుకంజలోనే ఉన్నారు. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓటమిని అంగీకరించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచి సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత అవధేష్ ప్రసాద్ మిల్కిపూర్ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఫిబ్రవరి 5న ఉపఎన్నిక జరిగింది. గతంలో ఆ స్థానంలో ఓడిన బీజేపీ.. ఈ సారి గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.

మిల్కిపూర్ లో బీజేపీ జెండాను ఎగురవేసిన చంద్రభాను పాశ్వాన్ ఎవరో తెలుసుకుందాం. అయోధ్యలోని మిల్కిపూర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసేందుకు ఎంతో మంది ప్రముఖ నేతలకు బదులుగా చంద్రభాను పాశ్వాన్ కు బీజేపీ బాధ్యతలను అప్పగించింది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ కుమారుడు అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ను అభ్యర్థిగా ప్రకటించింది. చంద్రభాను పాశ్వాన్ రుడౌలిలోని పర్సౌలి గ్రామానికి చెందినవారు. వృత్తీరీత్యా న్యాయవాది అయిన చంద్రభాను పాశ్వాన్.. అయోధ్యలోని రుడౌలి నుంచి రెండుసార్లు జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భార్య జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఉన్నారు.

BJP s Grand Victory and Revenge in Milkipur By Election
1986లో జన్మించిన చంద్రభాను పాశ్వాన్ కుటుంబం మొత్తం చీరల వ్యాపారంలో చురుకుగా ఉంది. సూరత్ తో పాటు ఆయన రుడౌలిలో చీరల వ్యాపారం కూడా చేశారు. చంద్రభాను గత 2 ఏళ్లుగా మిల్కిపూర్ అసెంబ్లీ స్థానంలో చురుకుగా ఉన్నారు. అందుకే ఆయన మిల్కిపూర్ ఉపఎన్నికలో ప్రధాన పోటీదారులలో ఒకరిగా నిలిచారు. చంద్రభాను పాశ్వాన్ బీకాం, ఎంకాం, ఎల్ఎల్ బీ చదివారు. మిల్కిపూర్ సీటుకు బీజేపీ టికెట్ కోసం అరడజను మంది పోటీదారుల ఉండగా.. వారందరిని కాదని ఆ సీటును చంద్రభాను పాశ్వాన్ దక్కించుకున్నారు. పోటీదారులలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గోరఖ్ నాథ్ బాబా, రాము ప్రియదర్శి కూడా ఉన్నారు. వీరితో పాటు డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సురేంద్ర కుమార్ కూడా టికెట్ కోసం బలమైన పోటీదారుగా పరగణించబడ్డారు.

ఈ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు మంత్రులు తీవ్రంగా ప్రచారం చేశారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా అనేక మంది నాయకులు అజిత్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కానీ చివరికి బీజేపీకే విజయం దక్కింది. లోక్ సభ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానంలో బీజేపీ ఓటమికి ప్రతీకారంగా ఈ విజయం దక్కిందని భావిస్తున్నారు.2024 లోక్ సభ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ బీజేపీకి చెందిన లల్లూ సింగ్ ను ఓడించారు. కానీ ఇప్పుడు అయోధ్యలోని మిల్కిపూర్ స్థానంలో అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+