బాంబులు పెట్టి లేపేస్తా: నితీష్కు బెదిరింపు మెసేజ్
పాట్నా: బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జేడీయూ నేత నితీష్ కుమార్కు బాంబు బెదిరింపు ఓ సందేశం (ఎస్ఎంఎస్) ద్వారా వచ్చింది. నితీశ్ కుమార్ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరించాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ ఛానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు ఛానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎస్ఎంఎస్ ఆధారంగా శ్రీకృష్ణపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పాట్నా సీనియర్ ఎస్పీ వికాస్ వైభవ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరుగుతోందని చెప్పారు. వేరే రాష్ట్రం నుంచి ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు గుర్తించామని తెలిపారు.
సిఎం నితీష్ కుమార్కు ఇప్పటికే జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని చెప్పిన ఆయన.. బెదిరింపు సందేశం నేపథ్యంలో మరింత భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications