Budget 2024: బడ్జెట్ లోనూ మాల్గీవులకు షాకిచ్చిన కేంద్రం..!
మన దేశానికి పొరుగునే ఉంటూ మనపై విషం చిమ్ముతున్న మాల్దీవులకు కేంద్రం మరో షాకిచ్చింది. ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ పై విమర్శలు గుప్పించడంతో మొదలుపెట్టి చైనాతో స్నేహం పెంచుకుంటున్న మాల్దీవులకు ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ షాకిచ్చింది. భారత్ తో పెట్టుకుని ఇప్పటికే పర్యాటకం సహా పలు విధాలుగా నష్టపోతున్న మాల్దీవులకు కేంద్రం నిర్ణయం మరింత ఇబ్బందికరంగా మారబోతోంది.
ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి తీసుకున్న నిర్ణయాల్లో మాల్దీవులకు షాకిచ్చారు. ఏటా విదేశాలకు ఇచ్చే గ్రాంట్లలో మాల్దీవులకు 22 శాతం కోత విధించాలని నిర్ణయించారు. మాల్దీవుల అభివృద్ధి సహాయం కోసం ఈసారి కేంద్రం రూ.600 కోట్లు కేటాయించింది. ఇది విదేశాలకు భారత ప్రభుత్వం చేస్తున్న మూడో అతిపెద్ద సాయం.

2023-24లో మాల్దీవులకు భారత్ రూ.770.90 కోట్ల గ్రాంట్ అందించింది. 2022-23లో మంజూరు చేసిన రూ.183.16 కోట్లతో పోలిస్తే ఇది 300 శాతం పెరిగింది. వాస్తవానికి 2023 బడ్జెట్లో మాల్దీవుల కోసం ప్రభుత్వం మొదట రూ.400 కోట్లు కేటాయించింది. తర్వాత దానిని రూ.770.90 కోట్లకు పెంచింది. ఈసారి దాన్ని 22 శాతం తగ్గించి రూ.600 కోట్లకు పరిమితం చేసింది. గత కొన్నేళ్లుగా భారతదేశం మాల్దీవులకు ప్రధాన గ్రాంట్ల సాయందారుగా ఉంది. మాల్దీవుల్లో రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కోసం భారత్ ఈ సాయం చేస్తోంది.
అయితే రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విదేశాలకు అందించే మొత్తం సహాయాన్ని కూడా ప్రభుత్వం 10 శాతం తగ్గించింది. భారతదేశం 2024-25 కోసం విదేశాలకు గ్రాంట్ రూపంలో రూ. 4883.56 కోట్లు కేటాయించింది. ఇది 2023-24లో కేటాయించిన 5426.78 కోట్లతో పోలిస్తే తక్కువే. అయితే కేంద్రం విదేశాలకు ఇస్తున్న గ్రాంట్లో భూటాన్, నేపాల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే కేటాయింపులు తగ్గిన ఇతర దేశాలలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, లాటిన్ అమెరికా దేశాలు ఉన్నాయి. అటు శ్రీలంక, ఆఫ్రికా దేశాలు, మారిషస్, సీషెల్స్లకు మాత్రం కేటాయింపులు పెరిగాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications