ముంబైలో ఆంధ్రా మహిళా టెక్కీ హత్య, రింగ్ ఆధారంగా
సెలవుల కోసం వచ్చిన ఆమె తిరిగి ముంబై బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. గురువారం ముంబైలోని కంజుమార్గ్లో ఆమె మృతదేహం కాలిపోయి కనిపించింది. ఈ మృతదేహం అనూహ్యదని తండ్రి ప్రసాద్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఆమె చేతికి ఉన్న ఉంగరాన్ని బట్టి కుటుంబ సభ్యులు గుర్తించారు.
సెలవుల కోసం వచ్చిన ఆమె ముంబై వెళ్లేందుకు విశాఖపట్నం - ఎల్టిటి ఎక్స్ప్రెస్ రైల్లో ఈ నెల 4న విజయవాడలో ఎక్కారు. ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో తండ్రితో ఫోన్లో మాట్లాడారు. అప్పుడు రైలు షోలాపూర్లో ఉంది. అంధేరీలోని తన హాస్టల్కు చేరాక మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఫోన్ రాలేదు.
తండ్రి ప్రసాద్ ఎంతగా ప్రయత్నించినా స్పందన లేదు. ఆమె స్నేహితులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో కూతురు కనిపించట్లేదని విజయవాడ రైల్వే స్టేషన్లో 5న ఫిర్యాదు చేశారు. 8న ముంబై వచ్చి కుర్లా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చివరకు నిన్న కంజుమార్గులో కాలిన గాయాలతో కుళ్లిన మృతదేహం లభించిందని, అది అనూహ్యదిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. మర్డర్ కేసుగా నమోదు చేశారు.