మత్తు ఇచ్చి హోటల్లో లేడీ వ్యాపారవేత్తపై రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 33 ఏళ్ల ఓ మహిళా వ్యాపారవేత్తపై మరో వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు. శుక్రవారం కనౌట్ప్లేస్లోని ఓ హోటల్లో ఈ అఘాయిత్యం జరిగింది. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి - దక్షిణ ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీకి చెందిన బాధిత మహిళ సొంతంగా వ్యాపారం చేస్తోంది. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలపై చర్చించేందుకు చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ఆమెను హోటల్కు లంచ్కు ఆహ్వానించాడు.
ఇద్దరికీ గతంలో పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమె అతని ఆహ్వానాన్ని మన్నించింది. అయితే, ఆ వ్యాపారవేత్త ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. దాంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను హోటల్లోని గదికి తీసుకుని వెళ్లి ఆమెపై అతను అత్యాచారం చేశాడు.
స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, నిందితుడు అప్పటికే అక్కడి నుంచి చిత్తగించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.