లాక్ డౌన్ 4.0పై కేంద్రం కీలక ఆదేశాలు- సడలింపులపై రాష్ట్రాలకు హెచ్చరికలు....
దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన కరోనా వైరస్ లాక్ డౌన్ 4.0 విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే మరికొన్ని అంశాల్లో నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే ఇచ్చేసిన విషయాన్నీ వివరించింది. గతంలో సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో అవసరమైతే ఆంక్షలు విధించుకోవచ్చని, అయితే నియంత్రణలు ఉన్న ప్రాంతాల్లో సడలింపులను దుర్వినియోగం చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేదని తెలిపింది.
కరోనా పుట్టుక తేలాల్సిందే- -డబ్ల్యూహెచ్వో స్వతంత్ర దర్యాప్తు- డ్రాగన్ టార్గెట్ గా భారత్ అడుగులు
అలాగే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను నిర్ణయించే విషయంలోనూ పలు మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే స్ధానిక సంస్ధలు, స్ధానిక అధికార యంత్రాంగం ఇచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయాలు ఉండాలని సూచించారు.
కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చారు. జోన్ల నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పదేపదే కోరిన నేపథ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారాన్ని కట్టబెట్టింది