గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ..రైళ్లు రద్దు అయినప్పుడు టికెట్ డబ్బులపై
రైలు సేవలకు అంతరాయం ఏర్పడినప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లకు సంబంధించి రద్దు మరియు ఛార్జీల వాపసు ప్రక్రియ కోసం భారతీయ రైల్వేలు ద్వారా నిర్దిష్ట నిబంధనలు రూపొందించబడ్డాయి. ఈ విషయంలో రైలు పూర్తిగా రద్దు చేసిన సంధర్భంలో రిజర్వేషన్ టిక్కెట్లను రద్దు చేయడానికి సంబంధించిన నియమాలను క్రింద పునరుద్ఘాటించబడింది.రైల్వే రీఫండ్ నిబంధనల ప్రకారం, ప్రమాదాలు, ఉల్లంఘనలు, వరదలు, బంద్ లేదా రైలు రోకో మొదలైన అనివార్య పరిస్థితుల కారణంగా రైలు పూర్తిగా రద్దు చేయబడితే, పి.ఆర్.ఎస్ కౌంటర్ ద్వారా బుక్ చేసుకున్న రిజర్వేషన్ టికెట్ను రైలు బయలుదేరాల్సిన నిర్ణీత సమయం నుంచి 3 రోజులలోపు ఏదైనా రైల్వే స్టేషన్లోని పి.ఆర్.ఎస్ కౌంటర్లో అప్పగించాలి.
దానిని సమర్పించిన తర్వాత, మొత్తం ప్రయాణానికి ఎటువంటి రద్దు ఛార్జీలు లేకుండా చెల్లించిన పూర్తి ఛార్జీ ప్రయాణీకుడికి చెల్లించబడుతుంది. ఆన్లైన్ మార్గాల ద్వారా అంటే ఇ-టికెట్ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల విషయంలో, టికెట్ స్వయంచాలకంగా రద్దు చేయబడుతుంది మరియు ఛార్జీ యొక్క వాపసు ప్రక్రియ ఐ.ఆర్.సి.టి.సి ద్వారా చేయబడుతుంది మరియు సంబంధిత బ్యాంక్ ఖాతాకు జమ చేయబడుతుంది.

భారీ వర్షాల కారణంగా వరదలు, బంద్, రైల్ రోకో వంటి శాంతిభద్రతల పరిస్థితులు వంటి అసాధారణ సంఘటనల కారణంగా రైలు సర్వీసుల సరళిలో మార్పు అనివార్య పరిస్థితులలో తలెత్తుతుంది. ప్రయాణీకులకు భద్రత కల్పించడానికి రైల్వేలు రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వస్తుంది. భారతీయ రైల్వేలు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వివిధ మౌలిక సదుపాయాల పనులను చేపడుతోంది. అటువంటి పనులను చేపడుతుండగా, రైలు ప్రయాణీకులకు కనీసం అసౌకర్యం కలగకుండా పనులు జరిగేలా రైల్వేలు నిర్ధారిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను సులభతరం చేయడానికి రైలు సేవల సరళిని రద్దు చేయడం, మళ్లింపు రూపంలో మార్చాల్సిన అవసరం ఏర్పడుతోంది.
అటువంటి సందర్భాలలో, రైలు సేవల నమూనాలో మార్పుకు సంబంధించిన సమాచారాన్ని రైలు వినియోగదారులకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియా మరియు ప్రయాణీకుల మొబైల్కు టెక్స్ట్ సందేశాల ద్వారా తెలియజేస్తారు. అందుచేత టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణీకుల మొబైల్ నంబర్లను ఖచ్చితంగా అందించాలని సూచించబడింది. అందువల్ల దక్షిణ మధ్య రైల్వే రైల్వే వినియోగదారులు రీఫండ్ నిబంధనలను గమనించాలని మరియు రైలు సర్వీసులు పూర్తిగా రద్దు చేయబడితే, పూర్తి వాపసు పొందడానికి రైలు బయలుదేరాల్సిన నిర్ణీత సమయం నుంచి 3 రోజులలోపు సమీపంలోని ఏదైనా స్టేషన్లోని పి.ఆర్.ఎస్. కౌంటర్లో రిజర్వేషన్ టికెట్ను అప్పగించాలని విజ్ఞప్తి చేస్తుంది.












Click it and Unblock the Notifications