జీఎస్టీ బిల్లు అప్ లోడ్ చేయండి-కోటి వరకూ నగదు గెల్చుకోండి-కేంద్రం కొత్త స్కీం..
దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏటికేడాది పెరుగుతున్నాయి. అయినా వీటిని మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్రం కొత్త పథకాన్ని అమలు చేయబోతోంది. "మేరా బిల్ మేరా అధికార్ " పేరుతో జీఎస్టీ బిల్లుల్ని అప్ లోడ్ చేస్తే బహుమతులు ఇచ్చే కొత్త పథకాన్ని వచ్చే నెల 1 నుంచి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా మనం షాపులో ఎక్కడైనా జీఎస్టీ బిల్లు తీసుకుంటే దాన్ని వెబ్ సైట్ లేదా యాప్ లో అప్ లోడ్ చేస్తే సరిపోతుంది. లక్కీ డ్రాలో కోటి వరకూ నగదు గెల్చుకునే అవకాశం లభిస్తుంది.
Mera Bill Mera Adhikaar Scheme!
— CBIC (@cbic_india) August 22, 2023
👉 Launch from States of Haryana, Assam, Gujarat & UTs of Dadra & Nagar Haveli, Daman & Diu & Puducherry on 01/09/23.
👉Invoice incentive scheme which allows you to earn cash prizes on upload of GST Invoices.#Mera_Bill_Mera_Adhikaar pic.twitter.com/imH9VkakiY
షాపుల్లో, మాల్స్ లో ఇతరత్రా ఎక్కడ షాపింగ్ చేసినా తప్పనిసరిగా కస్టమర్లు వాటిని అమ్మిన వారి నుంచి జీఎస్టీ బిల్లులు అడిగి తీసుకునేలా ఈ పథకం ప్రోత్సహించబోతోంది. ఇలా తీసుకున్న బిల్లుల్ని కేంద్రం సూచించిన వెబ్ సైట్ లేదా యాప్ లో అప్ లోడ్ చేస్తే మూడు నెలలకోసారి డ్రా తీసి అందులో ఎంపికైన వారికి కోటి రూపాయల వరకూ నగదు బహుమతి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో ఈ పథకాన్ని కేవలం ఆరు రాష్ట్రాలకు పరిమితం చేయబోతున్నారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు వర్తింపచేస్తారు.

ఈ జీఎస్టీ రివార్డు పథకంలో భాగంగా నగదు బహుమతి పొందాలనుకునే వారు షాపింగ్ చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒక వేళ ఇవ్వకపోతే తప్పనిసరిగా అడిగి తీసుకోవాలి. అలా తీసుకున్న బిల్లుల్ని మేరా బిల్ మేరా అధికార్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
అయితే లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే మాత్రం కనీస బిల్లు రూ.200 చేసి ఉండాలి. ఓ నెలలో గరిష్టంగా 25 బిల్లుల్ని అప్ లోడ్ చేసే అవకాశం కల్పించారు. ఇలా చేసిన తర్వాత మూడు నెలలకు నిర్వహించే డ్రాలో ఎంపికైతే రూ.10 వేలు, 10 లక్షలు, కోటి రూపాయల చొప్పున నగదు బహుమతి అందుకోవచ్చు.
అయితే ఈ స్కీమ్ ను ప్రస్తుతానికి ఆరు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో అసోం, గుజరాత్, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్-డయ్యూ, దాద్రానగర్ హవేలీ, పుదుచ్చేరిలో మాత్రమే సెప్టెంబర్ 1 నుంచి అమలు చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరిస్తారు. ఈ స్కీమ్ అమలుతో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications