మంగళవారం భారత్ కు ఛోటా రాజన్!
బాలి: మాఫియా డాన్ ఛోటా రాజన్ ను భారత్ తీసుకురావడానికి సర్వం సిద్దం అయ్యింది. అతనిని భారత్ తీసుకు వెళ్లడానికి ఇండోనేషియా క్రైం బ్రాంచ్ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఇప్పటికే భారత్ సీబీఐ అధికారులు ఇండోనేషియాలోని బాలి చేరుకున్నారు.
సీబీఐ, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు బాలి చేరుకున్నారు. బాలిలోని జైలులో ఛోటా రాజన్ ను కలుసుకుని వివరాలు తెలుసుకున్నారు. తరువాత భారత్ అధికారులు ఇండోనేషియా అధికారులతో చర్చించి చట్టపరంగా అన్నిలాంఛనాలను పూర్తి చేశారు.
మంగళవారం ఛోటా రాజన్ ను భారత్ తీసుకు వచ్చే అవకాశం ఉంది. మొదట ఛోటా రాజన్ ను ఢిల్లీ తీసుకు వచ్చి అక్కడే విచారణ చేస్తారని సమాచారం. తరువాత అధికారులు చర్చించి రాజన్ ను ఎక్కడ సురక్షితంగా పెట్టాలనే నిర్ణయం తీసుకోనున్నారు.

ముంబై నగరంలో ఛోటా రాజన్ మీద సుమారు 70 క్రిమినెల్ కేసులు నమోదు అయ్యాయి. అందులో 30 హత్య కేసులు, డ్రగ్స్ సరఫరా, బలవంతపు వసూళ్లు తదితర కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 20 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఛోటా రాజన్ ఎట్టకేలకు భారత్ లో అడుగు పెట్టనున్నాడు.
ఇంటర్ పోల్ సహాయంతో ఇండోనేషియాలోని బాలి విమానాశ్రయంలో ఛోటా రాజన్ ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఛోటా రాజన్ భారత్ వచ్చిన తరువాత ఎవరెవరి పేర్లు బయటకు చెబుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications