P Veeramuthuvel : చంద్రయాన్ 3 మాస్టర్ మైండ్ వీరముత్తువేల్ ! మద్రాస్ ఐఐటియన్ ఘనత ఇదీ..
భారత అంతరిక్ష రంగాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లుందని భావిస్తున్న చంద్రయాన్ 3 రేపు ఏపీలోని శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగరబోతోంది. చంద్రుడి నిగూఢ రహస్యాలు శోధించే లక్ష్యంతో ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం కోసం మన దేశంతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇది విజయవంతమైతే యూఎస్, యూఎస్ఎస్ఆర్, చైనా తర్వాత నాలుగోదేశంగా భారత్ రికార్డులకెక్కబోతోంది. అయితే ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వెనుక ఉన్న ఓ మద్రాస్ ఐఐటీయన్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగాన్ని ప్లాన్ చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారతదేశం సాధించిన ఘనత గురించి దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఇస్రో శాస్త్రవేత్త పి వీరముత్తువేల్ యొక్క ఆలోచనే. ఇస్రో శాస్త్రవేత్త వీరముత్తువేల్ తమిళనాడులోని విల్లుపురం ప్రాంతానికి చెందిన వారు. ఇస్రోలో సీనియర్ శాస్త్రవేత్తగా పలు ర్యాంకులు సాధించారు. చంద్రయాన్ 3 హెడ్ గా ఉన్న ఆయన ప్రస్తుతం మూన్ మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు.

చంద్రయాన్ 3 ప్రాజెక్టులో ఆయన తన నైపుణ్యం అంతా ధారబోశారు. సెప్టెంబర్ 7న చంద్రయాన్-2 ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంలో విఫలమైన తర్వాత ఇస్రోకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎం. వనిత స్ధానంలో వీరముత్తువేల్ ను చంద్రయాన్ మిషన్ డైరెక్టర్గా నియమించారు. అయితే చంద్రయాన్ 3 మిషన్కు ప్రస్తుతం బాధ్యత వహిస్తున్న వీరముత్తువేల్.. గతంలో చంద్రయాన్ 2 మిషన్లోనూ కీలక పాత్ర పోషించారు.
చంద్రయాన్ 2 ప్రాజెక్టులో వీరముత్తువేల్ కృషిని గుర్తించిన ప్రభుత్వం.. ఆయన్ను చంద్రయాన్ 3కు ఛీఫ్ గా నియమించింది. ఆయన నాలుగేళ్ల కఠోర శ్రమతో ఎంతో అప్ గ్రేడ్ చేసిన చంద్రయాన్ 3ని రేపు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రునిపై భారతదేశ రెండో మిషన్ చంద్రయాన్-2 2019 జూలై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగికి ఎగిరింది. కానీ సెప్టెంబర్ 6 తెల్లవారుజామున చంద్రునిపై విక్రమ్ లూనార్ ల్యాండర్ కూలిపోవడంతో మిషన్ విఫలమైంది. అయితే ఈసారి చంద్రయాన్ 3లో భాగంగా ఆగస్ట్ 23 లేదా ఆగస్టు 24న విక్రమ్ ల్యాండర్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications