పంజాబ్ పోరు-కేజ్రివాల్ పై కుమార్ విశ్వాస్ ఆరోపణలు-విచారణకు ప్రధానికి చన్నీ వినతి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమవుతోంది. ఇవాళ్టితో రాష్ట్రంలో ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు కూడా అదే స్ధాయిలో పేలుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ కేజ్రివాల్, చరణ్ జీత్ సింగ్ చన్నీ, ప్రధాని మోడీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దింపేందుకు ఆప్ తో పాటు బీజేపీ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ పార్టీ కూడా వదులుకోవడం లేదు. తాజాగా సీఎం చన్నీ చేసిన యూపీ, బీహార్ భయ్యా వ్యాఖ్యల్ని ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలు, కేజ్రివాల్ కూడా తీవ్రంగా టార్గెట్ చేశారు. దీంతో చన్నీ ఎదురుదాడికి దిగారు. కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఆరోపణల్ని టార్గెట్ చేశారు. వీటిపై దర్యాప్తు చేయించాలని ప్రధాని మోడీని సీఎం చన్నీ కోరారు.

తన యూపీ,బీహార్,ఢిల్లీ దే భాయీ వ్యాఖ్యపై రాజకీయ దాడి నుండి తెలివిగా తప్పించుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ ఎదురుదాడి ప్రారంభించారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు. కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఖలిస్తాన్ వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాల్లో వాడకుండా విధించిన నిషేధాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది. దీంతో కేజ్రివాల్ పై చేసిన కిుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు సమంజసమే అని ఈసీ నమ్మినట్లయిందని చన్నీ భావిస్తున్నారు. దీంతో వీటిపై విచారణ చేయించాలని ప్రధాని మోడీని ఆయన కోరారు.
రాజకీయాలను పక్కన పెడితే, వేర్పాటువాదంతో పోరాడుతున్నప్పుడు పంజాబ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారని చన్నీ తెలిపారు. గౌరవనీయ ప్రధానమంత్రి ప్రతీ పంజాబీ యొక్క ఆందోళనను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో ఇప్పుడు తనపై వచ్చిన యూపీ-బీహార్ వ్యాఖ్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఆరోపణలపై చన్నీ విచారణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చన్నీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించినట్లు సొంత పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. వీటిపై చన్నీతో ప్రియాంక గాంధీ, ఇతర నేతలు కూడా ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications