చెన్నై మెట్రో రైలుకు నీటీ కటకట... రైలు ప్రయాణికులకు ఏసీలు బంద్....
భగభగ మండే ఎండలకు ప్రజల దాహర్తిని తీర్చే జలాశాయాలు అడుగట్టిపోయాయి. బోరుబావుల్లో భూగర్భజలాలు సైతం ఇంకిపోయాయి..దీంతో నీటికటకట దేశంలోని చాల రాష్ట్ర్ర్రాలను వెంటాడుతుంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో అటు మనుష్యులకే యంత్రాలకు కూడ నీటీ ఇబ్బందులు తలెత్తాయి. ఈనేపథ్యంలోనే చెన్నైలో సుమారు 45 కిలోమీటర్ల మేర రవాణ సౌకార్యాన్ని అందిస్తున్న మెట్రో రైల్లో ఏసీని నిలుపుదల చేశారు మెట్రో అధికారులు.
చెన్నై నగరం భారీ నీటీకటకటను ఎదుర్కోంటుంది. నగరంలోని ప్రజలు తాగడానికి నీళ్లులేక ఇబ్బందులు పడుతున్నారు. గత 70 సంవత్సరాల్లో ఎప్పుడు లేనట్టుగా భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో నీటీ కొరత ప్రభావం అక్కడి మెట్రో ప్రయాణికుల పైన పడింది. ఈనేపథ్యంలోనే నీటీ వినియోగాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 45 కిలోమీటలర్ల మేర ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న మెట్రో రైల్లో ఏసిని నిలుపుదల చేశారు మెట్రో అధికారులు. అయితే ఉదయం నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో ఏసీలను నిలిపివేశారు.
కాగా ప్రతిరోజు చెన్నై మెట్రో 9000 లీటర్ల నీటీని వినియోగిస్తున్నారు. కాగ ఇందులో 80శాతం నీటీనీ ఎయిర్ కండిషన్ సిస్టం కోసమే ఉపయోగిస్తున్నారు.కాగా చెన్నై నగరానికి నీటీని సప్లై చేస్తున్న వాటర్ ట్యాంక్లపై ప్రభుత్వం కొరఢా ఝలిపించడంతో సుమారు 5000వేల వాటర్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు. దీంతో నీటీ కటకట చాల తీవ్రతరం అయింది.