రేప్ యత్నం: తల్లిదండ్రులపై బాలిక ఫిర్యాదు
ఛండీగఢ్: తల్లిదండ్రులు తన చేత బలవంతంగా వ్యభిచారం చేయించాలని చూస్తున్నారంటూ తనను తాను రక్షించుకునేందుకు ఓ తొమ్మిదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని వల్లభ్గఢ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మొహ్నా గ్రావూనికి చెందిన ఓ బాలిక తన తండ్రి యజమాని ప్రేమ్సింగ్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేయబోయాడని, ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్తే వారు ప్రేమ్సింగ్ చెప్పినట్లు వినమని బలవంతం చేస్తున్నారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది.
ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని తల్లి బెదిరించిందని, ప్రేమ్ సింగ్ కూడా తనకి రూ.500 ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది.
బాలిక తన సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులైన బాలిక తల్లిదండ్రులు, ప్రేమ్సింగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గోడ కూలడంతో అక్కాచెల్లెళ్లు మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షలతో అతలాకుతలమవుతోంది. సద్వాపూర్ గ్రామంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఓ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రోహిణి(7), సుచిత్ర(5)గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.