కాంగ్రెస్కు కష్టకాలం: రాహుల్ నివాసానికి ప్రియాంకా, గెహ్లాట్, సచిన్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాను కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. ఇక తనకు ఆ పదవి చేపట్టడం ఇష్టం లేదని రాహుల్ గాంధీ బాహాటంగానే చెప్పేశారు కూడా. ఇక సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆ పార్టీ సంక్షోభం దిశగా వెళుతోందా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
Priyanka, Sachin Pilot meet Rahul Gandhi at his residence
— ANI Digital (@ani_digital) May 28, 2019
Read @ANI Story | https://t.co/fEjGt9MnMb pic.twitter.com/wbzM1qxuiY
లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు తన రాజీనామాను అంగీకరించాల్సిందిగా బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఇందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పుకోవడం లేదు. మరోవైపు రాహుల్ గాంధీ సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ను కూడా కలిసేందుకు ఇష్టపడని నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు ఆయన సోదరి ప్రియాంకా గాంధీ, సచిన్ పైలట్లు రాహుల్ నివాసానికి చేరుకున్నారు. వీరితో పాటు అశోక్ గెహ్లాట్, రణదీప్ సూర్జేవాలా కూడా రాహుల్ నివాసానికి చేరుకుని కాంగ్రెస్ ఓటమికి సమీక్ష జరుపుతున్నారు. రాహుల్కు అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కూడా రాహుల్ను కలిసిన వారిలో ఉన్నారు.
శనివారం జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీ తన రాజీనామాను సమర్పించారని అయితే అధిష్టానం తిరస్కరించిందని ఆ పార్టీ చెప్పింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఇష్టపడంలేదని చెప్పిన రాహుల్...త్వరలోనే తన స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండ్రోజులుగా రాహుల్ను కలవాలని అశోక్ గెహ్లాట్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన్ను కలిసేందుకు రాహుల్ నిరాకరించారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పలువురు సీనియర్ నాయకులను పార్టీ కోసం పనిచేయకుండా వారికుటుంబం కోసం పనిచేశారనే విమర్శలు చేశారు. రాహుల్ విమర్శలు చేసిన వారిలో అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్, చిదంబరంలాంటి వారున్నారు . వారు పార్టీ కోసం కాకుండా తమ కుమారుల కోసం పనిచేశారని విమర్శించారు.
Delhi: Rajasthan CM Ashok Gehlot arrives at the residence of Congress President Rahul Gandhi. Priyanka Gandhi Vadra, Randeep Singh Surjewala and Sachin Pilot are also present there. pic.twitter.com/fylvxe3qtc
— ANI (@ANI) May 28, 2019