తప్పే, సారీ: సోనియాని ఏకేసిన సొంత పత్రిక, ఏం రాసింది?
ముంబై: ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ సోమవారం నాడు పార్టీకి క్షమాపణలు చెప్పారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ పైన విమర్శలు గుప్పిస్తూ... కాంగ్రెస్ పార్టీ పత్రిక 'కాంగ్రెస్ దర్శన్'లో వచ్చింది.
దీనికి ఆయన క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ దర్శన్లో వచ్చిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరమేనని చెప్పారు. నేను నా తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు.
సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ దర్శన్ ఎడిటర్ ఇన్ చీఫ్ నిరుపమ్ కూడా మాట్లాడుతూ... నెహ్రూ, సోనియాలకు వ్యతిరేకంగా వచ్చిందని, దానికి బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

డిసెంబర్ 28, 1885లో ఇండియన్ జాతీయ కాంగ్రెస్ స్థాపించారు. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ 130వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో నెహ్రూ, సోనియాలకు వ్యతిరేకంగా వారి పార్టీ పత్రికలోనే రావడం చర్చకు దారి తీసింది.
ఆ పత్రికలో ఏం వచ్చింది?
మహారాష్ట్ర నుంచి వెలువడుతున్న 'కాంగ్రెస్ దర్శన్' పత్రికలో ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా వరుసగా కథనాలు వచ్చాయి. దీనిపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ పార్టీ మరాఠా శాఖ విపక్షాలకు సమాధానాలు చెప్పలేని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
సోనియా తండ్రిని ఇటలీలో ఫాసిస్ట్ ముఠా సభ్యుడిగా అభివర్ణించిన ఆ పత్రిక, పార్టీ సభ్యత్వం తీసుకున్న 62 రోజుల్లోనే సోనియా పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్నారని పేర్కొంది. అంతేకాక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా విఫలమయ్యారని విమర్శించింది.
నెహ్రూ గురించి పేర్కొంటూ... నాటి ఉప ప్రధానిగానే కాక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచనలను నెహ్రూ పెడచెవిన పెట్టారని ఆరోపించింది. నాడు పటేల్ సూచనలను పాటించి ఉంటే ప్రస్తుతం కాశ్మీర్లో నిత్యం అగ్గి రాజుకుని ఉండేది కాదని పేర్కొంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications