Madhya Pradesh Polls: మధ్యప్రదేశ్ నుంచి బీజేపీని తరిమికొడతామన్న రాహుల్ గాంధీ..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2020లో కమల్నాథ్ ప్రభుత్వం పతనానికి దారితీసిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటును ప్రస్తావించారు. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. స్వతంత్రుల మద్దతు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయిన 15 నెలల తర్వాత ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో బీజేపీ (109 సీట్లు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. "ఐదేళ్ల క్రితం మీరంతా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి ఎన్నుకున్నారు. మీరు బీజేపీని కాదు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు .. నరేంద్ర మోడీ, శివరాజ్సింగ్ చౌహాన్, అమిత్ షాలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్నికైన వారిని దోచుకున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు" అని మధ్యప్రదేశ్లోని విదిషాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన అన్నారు.

"కోట్లు రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా, మీ నిర్ణయం, మీ గొంతును బిజెపి నాయకులు, ప్రధానమంత్రి నొక్కేశారు" అని అన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్ తరిమికొడుతుందని గాంధీ శపథం చేశారు. "మేము బీజేపీతో పోరాడుతున్నాము. కర్ణాటకలో మేము వారిని తరిమికొట్టాము. హిమాచల్ ప్రదేశ్లో మేము వారిని తరిమికొట్టాము.. కానీ ద్వేషంతో కాదు. మేము 'నఫ్రత్ కా బజార్'లో 'మొహబ్బత్ కి దుకాన్' ప్రారంభించాము. మేము అహింసా సైనికులం, మేం కొట్టలేదు.. కానీ వాళ్లను ప్రేమతో తరిమికొట్టాం. వాళ్లకు ఇక్కడ స్థానం లేదని, మీరు కర్ణాటకను లూటీ చేశారు. 40% ప్రభుత్వాన్ని నడపండి కాబట్టి వెళ్లిపోండి.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 15 మాసాల్లోనే 27లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన భాజపా మాత్రం కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ రూ.1200 నుంచి రూ.1400లుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, ఛత్తీస్గఢ్లలో మాత్రం రూ.500లకే సిలిండర్ ఇస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications