సిబిఐతో మోడీని ఇరికించే ప్రయత్నం: జైట్లీ లేఖ

కాంగ్రెసు మిత్రపక్షంగా సిబిఐ వ్యవహరిస్తోందని, 2014 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన రాజకీయ ప్రత్యర్థులను అణచేయడానికి కాంగ్రెసు సిబిఐని వాడడానికి సిద్ధపడుతోందని నరేంద్ర మోడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు.
రాజకీయ ప్రేరేపిత దర్యాప్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన ప్రధానిని కోరారు. ప్రజాదరణనను కోల్పోయిన కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో తనమ పార్టీని, మోడీని ఓడించలేని గ్రహించి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయాలనే వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన అన్నారు. రాజకీయంగా తమ పార్టీని, మోడీని కాంగ్రెసు ఎదుర్కోలేదని, దీంతో సిబిఐని ప్రయోగించాలని చూస్తోందని ఆయన అన్నారు.
ప్రధానికి అరుణ్ జైట్లీ 15 పేజీల లేఖ రాశారు. కాంగ్రెసు పార్టీ కేంద్ర మంత్రులతో, పార్టీ సీనియర్ ఆఫీస్ బియరర్లతో ఓ రాజకీయ విభాగాన్ని నడుపుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోం మంత్రికి గుజరాత్ హోం మంత్రి సలహాదారుగా నియమించుకున్నారని, ఆ ఐపియస్ అధికారి గుజరాత్ రాజకీయ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించే పనులను సమన్వయం చేస్తాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications