ధరల లెక్కల్లో ఆహారం, విద్య గల్లంతు? Consumer Price Index బట్టబయలు
వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index) (CPI) ద్రవ్యోల్బణ లెక్కల నుంచి భారత్ ఆహారం, విద్యను తొలగించిందన్న ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. అయితే ఈ వాదనలకు వాస్తవంలో ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఫేక్ న్యూస్గా కొట్టిపారేసింది.
2024లో కేంద్ర గణాంకాల శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, ఆహారం మరియు విద్య రెండూ ఇప్పటికీ CPI బాస్కెట్లో కీలక భాగాలుగానే కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయడంలో సామాన్య ప్రజల ఖర్చుల సరళిని ప్రతిబింబించే ఈ విభాగాలను తొలగించారన్న ప్రచారం వాస్తవానికి దూరమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Consumer Price Index Basket: నిత్యావసరాల ధరలు
నివేదిక ప్రకారం, ఆహారం మరియు పానీయాలకు కలిపి 36.75 శాతం వెయిటేజ్ కొనసాగుతోంది. ఇందులో గ్రామీణ ప్రాంతాలకు 23.27 శాతం, పట్టణ ప్రాంతాలకు 13.49 శాతం వాటా ఉంది. అంటే నిత్యావసరాల ధరలు ఇప్పటికీ ద్రవ్యోల్బణ గణనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఇది స్పష్టం చేస్తోంది. అలాగే, విద్యా సేవలకు 3.33 శాతం వెయిటేజ్ ఉండగా, ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 1.32 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.01 శాతం భాగస్వామ్యం ఉంది.
ఇదిలా ఉండగా, CPI లెక్కింపు విధానాన్ని మరింత ఆధునికంగా, వాస్తవ వినియోగ విధానాలకు అనుగుణంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సూత్రాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రామాణిక సంవత్సరంగా ఉన్న 2011-12కు బదులుగా 2023-24ను కొత్త బేస్ ఇయర్గా తీసుకోవాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. గత దశాబ్దంలో వినియోగదారుల జీవనశైలి, ఖర్చుల సరళిలో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు ప్రతిపాదించబడ్డాయి.
కొత్త విధానం ప్రకారం CPI లెక్కింపుకు 12 విభాగాలు, 43 గ్రూపులు, 62 తరగతులు, 192 ఉప తరగతుల పరిధిలో మొత్తం 358 వస్తువులు, సేవలను పరిగణనలోకి తీసుకుంటారు. ధరల సమాచారాన్ని దేశవ్యాప్తంగా 434 పట్టణాల పరిధిలో ఉన్న 1,465 గ్రామీణ, 1,395 పట్టణ మార్కెట్ల నుంచి సేకరిస్తారు. అంతేకాదు, వినియోగదారుల డిజిటల్ అలవాట్లను ప్రతిబింబించేలా ఆన్లైన్, ఈ-కామర్స్ వేదికల నుంచి కూడా ధరలను ప్రతి వారం సేకరించనున్నారు.
ఫిబ్రవరి 12న విడుదల..
ఈ కొత్త CPI సిరీస్ ఆధారంగా తొలి ద్రవ్యోల్బణ గణాంకాలను ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. అయితే, గతంతో పోలిస్తే కొత్త సూచీలో ఆహారం, పానీయాలు, దుస్తులు, పాదరక్షలు, విద్యా సేవలకు వెయిటేజ్ కొంత తగ్గించగా, ఇతర సేవలు మరియు ఆధునిక వినియోగ విభాగాలకు వాటాను పెంచినట్లు నిపుణుల కమిటీ పేర్కొంది. ఇది ఆ విభాగాలను తొలగించారన్న అర్థం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే, CPI నుంచి ఆహారం, విద్యను తొలగించారన్న ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించే సమాచారం మాత్రమే. మారుతున్న వినియోగ ధోరణులకు అనుగుణంగా ద్రవ్యోల్బణ లెక్కింపును మరింత కచ్చితంగా చేయడమే కొత్త విధాన లక్ష్యం అని ప్రభుత్వం వివరిస్తోంది. ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మకుండా, అధికారిక ప్రకటనలు మరియు విశ్వసనీయ వనరుల ద్వారా వచ్చిన సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని PIB సూచించింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications