పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం 2 కోట్ల అదనపు కరోనా వ్యాక్సిన్లు: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనావైరస్ వ్యాప్తి తగ్గడంతో విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం వరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్లకుపైగా వ్యాక్సిన్లను కేటాయించింది.

ఈ అదనపు కరోనా వ్యాక్సిన్ డోసులు ఆగస్టు 27 నుంచి 31 వరకు రాష్ట్రాలకు చేరుకుంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం వెల్లడించారు. ఇమ్యునైజేషన్‌పై ఒక సాంకేతిక సలహా బృందం అక్టోబర్ నాటికి 12-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు వ్యాధికారక టీకాలు వేయడానికి ఒక వ్యూహాన్ని సిఫారసు చేసినప్పటికీ.. ముందుగా పెద్దలకు టీకాలు వేసిన తర్వాత ఆ వయస్సులో ఉన్న పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.

దాదాపు 97 లక్షల మంది టీచర్లు ఉన్నారు, ప్రాథమిక ప్రాధాన్యత మోతాదులను అందుకున్న ఫ్రంట్‌లైన్ కార్మికుల జాబితాలో లేనప్పటికీ, వీరిలో దాదాపు 50% మందికి ఇప్పటికే టీకాలు వేసినట్లు నీటి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ఆగస్టు నెల ప్రారంభంలో పేర్కొన్నారు.

 Coronavirus: Centre allots 2 crore vaccine doses for teachers,school staff

దాదాపు 25 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాలల సహాయక సిబ్బందికి టీకాలు వేయడం చాలా ముఖ్యం అని ప్రభుత్వ అగ్ర వైద్య సలహాదారులు ఇప్పుడు కోరారు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు 9-12 తరగతుల కోసం పాఠశాలలను పునర్ ప్రారంభించాయి, సెప్టెంబర్ నెలలో పాఠశాలను ప్రారంభించనున్నాయి, గుజరాత్ రాష్ట్రం 6వ తరగతి నుంచి పాఠశాలలను పునర్ ప్రారంభించే ప్రణాళికను ప్రకటించింది.

విద్యా సంస్థలతో సంబంధం ఉన్న వారందరికీ టీకాలు వేసేలా చూసుకోవడం ద్వారా దశలవారీగా పాఠశాలలను తెరవడానికి ఖచ్చితమైన ఒత్తిడి ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) చీఫ్ ఎన్‌కే అరోరా చెప్పారు. 'పాఠశాలల్లో, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బస్సు డ్రైవర్లు, ఎవరైతే సంప్రదిస్తున్నారో [ వారందరికీ టీకాలు వేయించాలి] తద్వారా పిల్లల చుట్టూ రక్షణ వలయం ఉంటుంది. పిల్లలు తీవ్రమైన వ్యాధి బారిన పడరు లేదా కోవిడ్‌తో చాలా జబ్బు పడరు, '' అని ఆయన చెప్పారు.

అక్టోబర్ నాటికి పెద్దలతో పాటు 12-17 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి జైకోవ్-డీ అందుబాటులో ఉంచబడుతుందని, నిజంగా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు ముందుగా టీకాలు వేయాలనే ఆలోచన ఉందని అరోరా తెలిపారు. 'వయోజన రోగనిరోధకత పూర్తయిన తర్వాత మాత్రమే ఆరోగ్యవంతమైన పిల్లలకు టీకాలు ఇవ్వబడతాయి" అని పేర్కొన్నారు.

ఒక సీనియర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ప్రకారం.. భారతదేశంలో 12-18 సంవత్సరాల వయస్సులో దాదాపు 12 కోట్ల మంది ఉన్నారు, వీరిలో 1% మంది తీవ్రమైన కరోనాకి గురవుతారు, వీరికి మూడు-మోతాదుల టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణ జనాభాలో డీఎన్ఏ ఆధారిత జైడస్ కాడిలా వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ అరోరా ధృవీకరించారు.

Recommended Video

    బేగంబజార్ లో సందడిగా మారిన రక్షబంధన్ షాపులు!!

    కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉపాధ్యాయులకు, పాఠశాల సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ డోసులను కేటాయించడం స్వాగతించదగ్గ విషయమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 2020 మార్చిలో కరోనా మహమ్మారి కారణంగా మూసివేయబడిన పాఠశాలల పునర్ ప్రారంభానికి ఇది ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+