విజయ మాల్యాకు బాంబే కోర్టు మరోసారి షాక్
లండన్: రూ.తొమ్మిదివేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యాకు న్యాయస్థానం మరోసారి షాకిచ్చింది. ముంబై స్పెషల్ న్యాయస్థానం ఆయనను ఉద్దేశ్యపూరిత ఎగవేతదారుగా ప్రకటించింది.
ఈడీపై మాల్యా ఆగ్రహం, ట్విస్ట్.. ముందే అమ్మేశారా?మనీ లాండరింగ్ కేసులో ఈ నెల 29వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు వ్యతిరేకంగా దాఖలైన నగదు బదలీ కేసులకు సంబంధించిన విచారణలో కోర్టు ఈ ఆర్డర్ జారీ చేసింది.

జూలై 29వ తేదీన ఉదయం పదకొండు గంటల లోపు కోర్టులో హాజరు కావాలని స్పెషల్ జడ్జి పీఆర్ భావకే ఆదేశించారు. కాగా, ఈడి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారించిన న్యాయస్థానం.. మాల్యా రూ.9వేల కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది.












Click it and Unblock the Notifications