3 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీ: కేంద్రమంత్రి హర్షవర్థన్...
కరోనా వైరస్ కోసం కోవిషిల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ అందజేసేందుకు నిపుణుల కమటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తొలుత అందజేసే 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. తొలివిడత 3 కోట్ల మందికి.. రెండో విడత 27 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.
Recommended Video

3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి విడత వ్యాక్సిన్ అందజేస్తామని హర్షవర్ధన్ తెలిపారు. వీరిలో కోటి మంది వైద్యారోగ్య సిబ్బంది అని.. 2 కోట్ల మంది పోలీసులు/ ఆర్మీ/ పారిశుద్ద్య కార్మికులు అని వివరించారు. దేశంలో 27 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశంలో కరోనా వైరస్ సోకి 1.49 లక్షల మంది చనిపోయారు.

పోలియో వ్యాక్సిన్ వేసిన సమయంలో కాస్త సంకోసించామని హర్షవర్థన్ తెలిపారు. కానీ సక్సెస్ కావడంతో ధైర్యం చేశామని వివరించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కూడా అలానే విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యాక్సిన్కు ఆమోదం లభించేవరకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరగబోదని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications