కోవిడ్ ఇంకా పోలేదు, మాస్కులు ధరించండి: రాష్ట్రాలకు ప్రధాని మోడీ కీలక సూచనలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని, అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం కేంద్రమంత్రులు, అధికారులతో అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక సూచనలు చేశారు.

రాష్ట్రాలన్ని కరోనా టెస్టులు పెంచాలని, అన్ని పాజిటివ్ కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు జరగనున్న క్రమంలో ప్రజలంతా మాస్కులు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసులు వేసుకోవాలన్నారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కేసుల కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు.

Covid isn’t over, wear masks: PM Modi calls for ramping up testing, genome sequencing At high-level meet

అంతేగాక, విమానాశ్రయాల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా టెస్టులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. ఇప్పటికే భారతదేశంలో నాలుగు కరోనావైరస్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 నమోదైన విషయం తెలిసిందే. గుజరాత్ రాష్ట్రంలో రెండు, ఒడిశాలో రెండు కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతానికి కరోనా కేసులు అందుబాటులోనే ఉన్నప్పటికీ.. చర్యలు తీసుకోకపోతే వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. డిసెంబర్ 19తో ముగిసే వారంలో సగటు రోజువారీ ఇన్‌ఫెక్షన్లు 158కి తగ్గడంతో భారతదేశంలో కేసులు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. గురువారం, భారతదేశంలో 185 తాజా కోవిడ్ కేసులు, ఒక మరణం నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,402కి తగ్గింది.

ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పరిస్థితిని సమీక్షించి, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించడం, టీకాలు వేయడంతో పాటు బూస్టర్ షాట్‌లకు అర్హులైన వారు కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించాలని ప్రజలను కోరారు.

కాగా, ఇటీవల కరోనా నిబంధనలు సడలించిన నేపథ్యంలోనే చైనాలో కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. వేలాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. చైనాలో రోజు రోజు రోగులు పెరుగుతుండటంతో వైద్యులు కూడా నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. వారు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వైద్యం అందక వందలాది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

రాబోయే కొద్ది నెలల్లో దేశ జనాభాలో 60 శాతం మందికి వ్యాధి సోకుతుందని ఒక ఎపిడెమియాలజిస్ట్ అంచనా వేశారు. కొత్త ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7 చాలా వేగంగా వ్యాపిస్తుంది. తక్కువ పొదిగే వ్యవధిని కలిగి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+